బ్రేకింగ్ న్యూస్..తెలంగాణలో 23 మంది ఐపీఎస్ ల బదిలీ..హైదరాబాద్ నూతన కమిషనర్గా సజ్జనార్, హోంశాఖ ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్..
మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల..రేపటి నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరణ..టెండర్ ఫీజు రూ. 3 లక్షలు.. తెలంగాణ
దసరా లక్కీ డ్రా పేరుతో ఆశ్చర్యకరమైన ఆఫర్లు..
తెలుగు రాష్ట్ర ప్రజలకు డీఎస్పీ నళిని బహిరంగ లేఖ..
ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇసుక అక్రమ రవాణా..అనుమతి లేకుండా తరలింపు..వాహనాలకు నంబర్ లేకుండా రవాణా..పట్టించుకోని సంబంధిత అధికారులు..
కాకతీయ హైస్కూల్పై హైకోర్టు సీరియస్..షోకాజ్ నోటీసులు జారీ..
కూలిన శిథిలావస్థలో ఉన్న పెంకుటిల్లు.. వృద్ధ దంపతులకు గాయాలు..
కూలిన శిథిలావస్థలో ఉన్న పెంకుటిల్లు..
వృద్ధ దంపతులకు గాయాలు..

సిద్దిపేట టైమ్స్ దౌల్తాబాద్:

నిరంతరంగా కురుస్తున్న వర్షాల కారణంగా మండల కేంద్రంలో పాత పెంకుటిల్లు ఇల్లు కూలిన ఘటన చోటుచేసుకుంది.ఈ ఘటనలో ఇంట్లో నివసిస్తున్న వృద్ధ దంపతులు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ అది వేణుగోపాల్ పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు వెంటనే వారిని బయటకు తీసి అంబులెన్స్ సాయంతో గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.ఎస్సై గంగధర అరుణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం వరుసగా కురుస్తున్న వర్షాల వలన ఇల్లు గోడలు బలహీనపడి తెల్లవారుజామున కూలిపోయాయి.దాంతో ఇంట్లో ఉన్న వృద్ధ దంపతులు శిథిలాల కింద చిక్కుకున్నారు. వారి కేకలు విని మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్ సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు.వైద్యులు తెలిపిన ప్రకారం బాధితులకు సాధారణ రక్త గాయాలే ఉన్నాయని ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు.ఇదే సమయంలో అధికారులు వర్షాల ప్రభావంతో బలహీనంగా మారిన పాత ఇళ్ళను గుర్తించి, నివాసులను అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రం తెలిపారు.













