వ్యక్తి అదృశ్యంపై కుటుంబ సభ్యుల నిరసన
సిద్దిపేట టైమ్స్,మద్దూరు:
మద్దూరు మండలంలోని మర్మాముల గ్రామానికి చెందిన యాటెల్లి శ్రీకాంత్(35)అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన పూర్ణ చందర్ రెడ్డి అనే లారీ డ్రైవర్ తో కొన్ని రోజుల క్రితం లారీపై తమిళనాడుకి వెళ్ళాడు.నెల రోజులు గడుస్తున్న శ్రీకాంత్ ఆచూకీ తేలియకపోవడంతో లారీ ఓనర్ బత్తిని కనకయ్య ఇంటి ముందు గురువారం శ్రీకాంత్ బంధువులు,కుటుంబ సభ్యులు నిరసన చేపట్టారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని నిరసనను విరమింపజేశారు.శ్రీకాంత్ భార్య యాటెల్లి కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు మే 15న మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎఎస్ఐ జగదీశ్ తెలిపారు.





