హాట్ టాపిక్‎గా మెదక్ పార్లమెంట్ స్థానం..గెలుపు ఓటమి పై బారీ బెట్టింగ్ లు..మెదక్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ఎవరు..!అందరి చూపు మెదక్ పార్లమెంట్ స్థానం వైపు..

హాట్ టాపిక్‎గా మెదక్ పార్లమెంట్ స్థానం..గెలుపు ఓటమి పై బారీ బెట్టింగ్ లు..మెదక్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ఎవరు..!అందరి చూపు మెదక్ పార్లమెంట్ స్థానం వైపు..

హాట్ టాపిక్‎గా మెదక్ పార్లమెంట్ స్థానం..
గెలుపు ఓటమి పై బారీ బెట్టింగ్ లు..
మెదక్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ఎవరు..!
అందరి చూపు మెదక్ పార్లమెంట్ స్థానం వైపు..

సిద్దిపేట టైమ్స్, మడూరి శ్రీరామ్;

గత 23 రోజుల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు జరుగుతుండటంతో ఉత్కంఠ తమకు తేరపడనుంది.
హాట్ టాపిక్‎గా మెదక్ పార్లమెంట్ స్థానం.. నిలుస్తుంది. మరి కొన్ని గంటల్లో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వేలువడనున్నాయి.. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ వచ్చాయి. ఎగ్జిట్ పోల్ పలీతాల్లో కొన్ని సంస్థ లు బీఆర్ఎస్ కు ఒక స్థానంలో గెలుస్తుందని తెలిపారు. దీంతో రాజకీయ విశ్లేషకులలో మెదక్ పార్లమెంట్  స్థానం పై తీవ్రంగా చర్చ కొనసాగుతుంది.
ఈ నేపథ్యంలో మెదక్ ఎంపీ గా ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.. గెలుపు ఓటమిలపై బెట్టింగ్ లు జోరుగా సాగుతున్నాయి..
క్రికెట్ నుంచి కబడ్డీ దాకా ప్రతిదానిపైనా బెట్టింగ్ కాసే..  బెట్టింగ్ బాబు లకు మెదక్ ఎంపీ అభ్యర్థుల గెలుపు ఓటమిల పై లక్షల కొద్దీ భారీగా బెట్టింగ్ లు కాస్తున్నారు..
మెదక్ పార్లమెంట్ ఎంపీ గా ఏ పార్టి గెలుస్తుంది.. ఏ అభ్యర్థికి ఎంత మెజారిటీ వస్తుంది, మెదటి రెండు మూడు స్థానాల్లో ఎవరు ఉంటారు ఇలా మొదలుకుని..  ప్రతి అంశంపైనా బుకీలు జోరుగా బెట్టింగ్ వ్యవహారం నడిపిస్తున్నారు.

అందరి చూపు మెదక్ పార్లమెంట్ స్థానం ప్రస్తుతం దీనిపైనే ఉంది..  తమ అభ్యర్థి గెలుపు కోసం ప్రధాన పార్టీ లన్ని మెదక్ స్థానాన్ని ఎంతో ప్రతిష్టత్మాకంగా తీసుకున్నాయి ఒక వైపు మాజీముఖ్యమంత్రి, కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు లు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడం ఇటు రాష్టం లో కాంగ్రెస్ అధికారం లో ఉండటం, అటు కేంద్రం లో బిజెపి అధికారం లో ఉండటం తో ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల పోరు చాలా రసవత్తరంగా కొనసాగింది. రాష్ట్ర, కేంద్రం లో అధికారంలో పార్టీలు తమ అభ్యర్థుల ను గెలిపిచుకుని తమ సత్త చూపాలనే కృతనిచ్చయంతో పోటీ పడుతున్నారు. దీంతో మెదక్ అభ్యర్థుల పై పందెం రాయుళ్లు జోరుగా బెట్టింగ్ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడని తెగ పందేలు కాస్తున్నారు.

సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలతో పాటు రాష్టం అంతటా మెదక్ సీటు గెలుపు పై ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. బిఆర్ఎస్ నుండి మాజీ కలెక్టర్ ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి, కాంగ్రెస్ నుండి నీలం మధు, బిజెపి నుండి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావులు పోటీ చేశారు. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు పేరు ప్రఖ్యాతలున్న వారు కావటం తో మెదక్ స్థానం ఎవరికి సొంతం అవుతుందో నన్న ఉత్కంఠ కు నేడు తేర పడనుంది. దీంతో మెదక్ ఎంపీ గా ఎవరు గెలుస్తారని గెలుపు గుర్రాలపై బెట్టింగులు కాస్తున్నారు.

మెదక్ పార్లమెంట్ స్థానం ఇప్పుడు హాట్ టాపిక్‎గా మారింది. ఈ స్థానాల్లో గెలిచే గెలుపు గుర్రాల పై రాజకీయ నేతలే కాకుండా.. సామాన్య ప్రజానీకం కూడా లక్షల్లో బెట్టింగ్ కాస్తున్నారని సమాచారం.
ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి ఏ రాజకీయ విశ్లేషకుడు కూడా ఈ స్థానాలపై ఖచ్చితమైన వివరణ ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. ఇక్కడి ప్రజలు కూడా ఎప్పుడు ఎలాంటి తీర్పు ఇస్తారో ఎవ్వరికి అంతుచిక్కని పరిస్థితి అందుకే రాష్టంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అందరి చూపు ఉమ్మడి మెదక్ జిల్లా వైపే వుంటుంది. మెదక్ పార్లమెంట్ స్థానం1952 లో ఏర్పడింది. 1980లో మెదక్ పార్లమెంట్ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున శ్రీమతి ఇందిరాగాంధీ పోటీ చేసి గెలుపొందారు. కానీ గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీకి మెదక్ పార్లమెంట్ కంచుకోటగా మారింది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో సీన్ మారింది. ఈ స్థానం లో గెలుపొందాలని కాంగ్రెస్ బిజెపి లు తీవ్రంగా కృషి చేసాయి. బిఅర్ఎస్ కూడా అంతే స్థాయిలో వర్క్ అవుట్ చేసింది. మూడు పార్టీలు ఈ స్థానాన్ని సీరియస్‎గా తీసుకున్నాయి. మెదక్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ నుండి నీలంమధు, బీజేపీ నుండి రఘునందన్ రావు, బీఆర్ఎస్ నుండి వెంకట్ రామ్ రెడ్డిలు పోటీ చేశారు. తమ గెలుపు కోసం భారీ బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు, కార్నర్ మీటింగ్ లు, రోడ్డు షో లు భారీగా నిర్వహించారు…

మెదక్ ఎంపీ గా ఎవరు గెలుస్తారు.. అనే చర్చ బాగా జరుగుతుంది. ఈ క్రమం లోనే బెట్టింగు బాబులు భారీగా పందాలు కాస్తున్నారు. ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను గెలిపించడానికి బాగా కష్ట పడ్డాయి. ఆయ పార్టీలకు సంబంధించిన ఇతర రాష్టాల నేతలను సైతం తీసుకువచ్చి ప్రచారం చేయించడం ద్వారా ఇక్కడి ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. మే 13న ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరిగాయి. ఇదంతా ఒక వైపు అయితే, మరో వైపు తామే గెలుస్తాము అన్న విశ్వాసం రాజకీయ నాయకుల నుండి కార్యకర్తల్లో కొటోచ్చినట్టు కనబడుతుంది. ఈ క్రమంలోనే బెట్టింగ్ బాబులు ఈ స్థానం పై లక్షల్లో పందేలు కాస్తున్నారు.  ఒకరు డబ్బులతో పందేలు కాస్తుంటే.. మరికొందరు తమ స్థిరచర ఆస్తులను సైతం పందేల్లో పెడుతున్నారని సమాచారం. ఈ ఉత్కంఠకు తెర పడాలంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *