డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ వ్యక్తికి 3 రోజుల జైలు శిక్ష
సిద్దిపేట టైమ్స్,మద్దూరు(నవంబర్,07):
మద్దూరు పోలీసులు ఇటీవల వాహనాలు తనిఖీలు చేస్తుండగా బచ్చన్నపేట మండలం బసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తీగల సిద్దులు(45) డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డాడు.దీంతో చేర్యాల మెజిస్ట్రేట్ ముందు సిద్దులును పోలీసులు హాజరుపరచగా మూడు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎఎస్ఐ సదాశివరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.మద్యం సేవించి వాహనాలు నడిపితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎఎస్ఐ హెచ్చరించారు.
Posted inమద్దూరు
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ వ్యక్తికి 3 రోజుల జైలు శిక్ష





