అతిఉత్కృష్ట సేవా పథకానికి ఎంపికైన త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్..
అభినందించి పోలీస్ కమిషనర్ అనురాధ, ఐపీఎస్..
సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేట ప్రతినిధి; జూలై 07
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2025 అతిఉత్కృష్ట సేవా పథకం కు త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ ఎంపికయ్యారు. సోమవారం సిపి అనురాధను మర్యాదపూర్వకంగా కలిశారు. విద్యాసాగర్ ను సిపి అనురాధ అభినందించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. అతిఉత్కృష్ట సేవా పథక్ త్వరలో అందజేస్తామని తెలిపారు. ప్రతిభ కనబరిచే అధికారులను, సిబ్బందిని గుర్తించి వారిని ప్రోత్సహించే విధంగా రివార్డులు, అవార్డులు, సేవా పతకాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రజల కోసం అంకితభావంతో విధులు నిర్వహించి, ప్రజలకు ఎల్లవేళలా సేవలు అందించడానికి అందుబాటులో ఉండాలని తెలిపారు. మరియు ప్రతి ఒక్కరూ ఫంక్షవల్ వర్టికల్ వారిగా పోటీపడి విధులు నిర్వహించి రివార్డులు, అవార్డులు పొందాలని సూచించారు. కష్టపడి అంకితభావంతో విధులు నిర్వహించే వారికి ఏదో ఒక రోజు తప్పకుండా డిపార్ట్మెంట్లో గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఇలాంటి రీమార్క్ లేకుండా 25 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న విద్యాసాగర్ కు సేవా పథకానికి ఎంపిక కావడం జరిగింది.





