గంజాయి ఇతర మత్తుపదార్థాల పై పటిష్టమైన నిఘా
మత్తు పదార్థాలు కలిగి ఉన్నా లేక అక్రమంగా రవాణా చేసిన చట్ట ప్రకారం కేసులు
మత్తుపదార్థాల నివారణ గురించి అనుమానస్పద ప్రాంతాలలో హుస్నాబాద్ పోలీసుల తనిఖీలు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం హుస్నాబాద్ పట్టణ పరిసర ప్రాంతాల్లో కిరాణా షాపులలో బేకరీలలో టీకొట్లలో పాన్ డబ్బాలు మరియు తదితర అనుమానాస్పద ప్రదేశాలలో గంజాయి, డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల గురించి నార్కోటిక్ డాగ్స్ తో హుస్నాబాద్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మహేష్ , మాట్లాడుతూ…గంజాయి ఇతర మత్తుపదార్థాల పై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, గంజాయి రహిత జిల్లా గురించి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. యువత తాత్కాలిక ఆనందం కొరకు జీవితాలు నాశనం చేసుకోవద్దని, గంజాయి ఇతర మత్తు పదార్థాలు మరియు మత్తు పదార్థాలు కలిపిన చాక్లెట్స్ ఎవరైనా కలిగి ఉన్నా లేక అక్రమంగా రవాణా చేసిన పాన్ షాపులలో కానీ ఇతర షాపులలో అమ్మిన చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గంజాయి ఇతర మత్తుపదార్థాలు ఎవరైనా కలిగి ఉంటే అమ్మిన విక్రయించిన వెంటనే డయల్ 100 లేదా తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్,1908 లేదా హుస్నాబాద్ పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఏఎస్ఐ సంపత్ రెడ్డి, డాగ్ స్క్వాడ్ సిబ్బంది పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.








