ట్రాక్టర్ బోల్తాపడి యువకుడు మృతి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం పోతారం (జే) గ్రామంలో బుధవారం తెల్లవారుజామున విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడి లింగాల భాను అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బోల్తా పడిన ట్రాక్టర్ ఇంజిన్ క్రింద భాను శరీరం మొత్తం ఇరుక్కుపోయింది. తల భాగం మాత్రమే బయటకి కనబడడంతో జేసీబీ సహాయంతో ట్రాక్టర్ను పైకి లేపి భాను మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.





