ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ కి ధీటుగా తయారు చేయాలి

ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ కి ధీటుగా తయారు చేయాలి

ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ కి ధీటుగా తయారు చేయాలి

తల్లిదండ్రులకు పుట్టిన ఊరు కు మంచి పేరు తేవాలి

రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

హుస్నాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ కి ధీటుగా తయారు చేయాలని అన్ని రకాల మౌలిక వసతులు ప్రభుత్వం కల్పిస్తుందని, ప్రభుత్వ పాఠశాలల విద్యుత్ బిల్లులు ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్ లు చేపట్టి వారిలో ఉన్న అసంతృప్తి తొలగించిందన్నారు. అన్ని పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచండి..మీకు మద్దతుగా నేనుంటానన్నారు

ప్రతి గ్రామంలో తల్లిదండ్రులను కలిసి ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తుకు ఒక భరోసా కల్పించాలన్నారు.
పది మంది ఉపాధ్యాయులకు ముప్పై మంది విద్యార్థులు ఉంటే సహేతుకంగా లేదని, విద్యార్థుల సంఖ్యను పెంచి పోటీత్వతన్ని పెంచేలా శ్రమ పడండని, మీతో పాటు నేను వస్తానన్నారు. అందరం ప్రభుత్వ పాఠశాలల్లో చదివి వచ్చిన వాళ్ళమేనని..ఉపాధ్యాయులు ఎన్నో ట్రెయిన్డ్ పరీక్షలు రాసి వచ్చరని కాని ప్రభుత్వం ఇన్ని మౌలిక వసతులు కల్పిస్తున్న విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని విద్యార్థుల సంఖ్యను పెంచడానికి కృషి చేయాలన్నారు.మీ తల్లిదండ్రులు కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారని, రేపటి తెలంగాణ భవిష్యత్ కి మీరే ఆస్తి అందరూ బాగా చదువుకొని తల్లిదండ్రులకు, పుట్టిన ఊరు కు మంచి పేరు తేవాలన్నారు. విద్యార్థులందరూ బాగా చదువుకొని తెలంగాణ ఉజ్వల భవిష్యత్ కి పునాదులు వేయండి అన్నారు.

మీ తల్లిదండ్రులు కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారని, రేపటి తెలంగాణ భవిష్యత్ కి మీరే ఆస్తి అందరూ బాగా చదువుకొని తల్లిదండ్రులకు, పుట్టిన ఊరు కు మంచి పేరు తేవాలన్నారు. విద్యార్థులందరూ బాగా చదువుకొని తెలంగాణ ఉజ్వల భవిష్యత్ కి పునాదులు వేయండి అన్నారు.

ఈ కార్యక్రమంలో సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, మున్సిపల్ కమిషనర్ ఇతర ముఖ్య నేతలు, అధికారులు మరియు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *