ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నపు బియ్యం పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నపు బియ్యం పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నపు బియ్యం పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే

200 కోట్ల రూపాయలతో రామయంపేట్ లో ఇంటిగ్రేటెడ్ స్కూల్

మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే డాక్టర్ మైనపల్లి రోహిత్ రావు

సిద్దిపేట్ టైమ్స్ రామాయంపేట ప్రతినిధి

రామాయంపేట మండల కేంద్రంలో 200 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మించడం జరుగుతుందని, రామాయంపేట మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని, రామాయంపేట పట్టణం తో పాటు మండలానికి 30 కోట్ల నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు, రామాయంపేట మున్సిపల్ పరిధిలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనాంపల్లి రోహిత్ పర్యటించారు పట్టణంలోని సుమారు 14 కోట్ల యాభై లక్షల రూపాయల నిధులతో నిర్మాణం చేపట్టే బీటీ రోడ్లకు ఆయన శంకుస్థాపన చేశారు, మండలంలోని లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులతో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకాన్ని ఆయన ప్రారంభించారు, అనంతరం టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాత రావు, ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ పది సంవత్సరాల లో జరగని అభివృద్ధిని మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంనర కాలంలోనే అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం జరుగుతుందని వారన్నారు, రామాయంపేట పట్టణంలో 200 కోట్లు నిధులు కేటాయించి ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మించడం జరుగుతుందని ఆయన అన్నారు, రామాయంపేట పట్టణ మరియు మండల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం జరుగుతుందని, మెదక్ నియోజకవర్గంలో ఏడుపాయల దుర్గామాత దేవాలయం తో పాటు చర్చ్ నీ అభివృద్ధి పరచడం జరుగుతుందని ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర నాయకుడు చౌదరి సుప్రభాత రావు, మాజీ జెడ్పిటిసి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, R&B ఈ ఈ సర్దార్ సింగ్, ఏఈ విజయ సారధి, తహసిల్దార్ రజనీకుమారి, ఎంపీడీవో షాజీలుద్దిన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, గజవాడ నాగరాజు,దేమే యాదగిరి, శివప్రసాద్, ఎనిశెట్టి సంతోష్,ఎనిశెట్టి అశోక్, నాగరాజు, సుందర్ సింగ్, అల్లాడి వెంకటేష్, బాలు, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు,

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *