ఏసీబీ వలలో దుబ్బాక రెవెన్యూ ఇన్స్పెక్టర్..
సిద్దిపేట టైమ్స్, దుబ్బాక,
సిద్దిపేట జిల్లా దుబ్బాక రెవెన్యూ డివిజన్ దుబ్బాక ఆర్ఐ ఏసీబీ వలకు చిక్కారు. బుధవారం సాయంత్రం 6. 50 ప్రాంతంలో, సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం దుబ్బాక తహశీల్దార్ కార్యాలయం లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న నర్సింహారెడ్డి రూ. 10 లక్షల లంచం డిమాండ్ చేసి లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. “సిద్దిపేట జిల్లా దుబ్బనక మండలం అప్పనపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 257, 259, 266, 275, 287 రైతు రాజి రెడ్డి నుండి కుంభం సుజాత పేరు మీద ఉన్న పట్టా భూమిని వారసత్వంగా పొందడం” అనే అధికారిక సహాయం పోందడం కోసం ఫిర్యాదుదారు నుండి లక్ష రూపాయలు దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామం లక్ష్మీ టీ పాయింట్ వద్ద నిందితుడి వద్ద నుండి లంచం తీసుకుంటుండాగా ఏసీబీ అధికారులు చాకచక్యంగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు.
అందువల్ల, నిందితుడిని అధికారులు అరెస్టు చేసి, హైదరాబాద్ నాంపల్లి ఏసిబీ కోర్టు, ముందు హాజరుచనున్నట్లు తెలిపారు.
ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగిన సందర్భంలో, చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి ప్రజలు ఏసీబీ, టోల్ ఫ్రీ నంబర్-1064ని సంప్రదించాలని కోరారు.. ఫిర్యాదుదారు,బాధితుడి పేరు మరియు వివరాలను గోప్యంగా ఉంచుతానని.





