విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు చేరుతారు

విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు చేరుతారు

విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు చేరుతారు


– డ్రగ్స్ గంజాయి  మత్తు పదార్థాలకు దూరం ఉండాలి

– మైనర్  లు డ్రైవింగ్ చేయవద్దు

– అమ్మాయిలను  వేధిస్తే షీటీమ్ సిబ్బందికి సమాచారం అందించాలి

– దుబ్బాక ఎస్ఐ గంగరాజు

సిద్దిపేట టైమ్స్ , దుబ్బాక ప్రతినిధి

దుబ్బాక కేజీబీవీ స్కూల్   విద్యార్థినిలకు  మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి, షీ టీమ్ నిర్వహిస్తున్న విధుల గురించి, షీ టీమ్ ద్వారా ఎలా రక్షణ పొందొచ్చు అనే అంశాల గురించి, ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ షీ టీమ్స్/ యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ సైబర్ నేరాలు,నూతన చట్టాల గురించి, గుడ్ టచ్, బాడ్ టచ్  మరియు అపరిచిత వ్యక్తుల యొక్క ఫోన్ కాల్స్ మరియు మాటలు నమ్మవద్దని ,సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే భవిష్యత్ అంత మంచిగా ఉంటుందని మహిళల భద్రతకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాంమని, మహిళల భద్రత మా ముఖ్య బాద్యత అని చదువుకునే సమయములో చెడు అలవాట్లకు బానిస కావొద్దు అని  దుబ్బాక ఎస్సై గంగరాజు అన్నారు. బుధవారం రోజున కేజీవీబీ పాఠశాలలో విద్యార్థులకు మహిళా రక్షణ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టి సారించాలని తెలిపారు. డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాలపై  అప్రమత్తంగా ఉండాలన్నారు. చదువుకోవడం వలన భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని అన్నారు. పిల్లలను చదివించటానికి తల్లిదండ్రులు చేస్తున్న కష్టాన్ని మనసులో పెట్టుకొని చదువుపై శ్రద్ధ వహించాలని మరియు సామాజిక రుగ్మతల గురించి ఎవరైనా పిల్లలను మహిళలను వేధించినట్లయితే  వెంటనే డయల్ 100  లేదా సిద్దిపేట షీ టీమ్ నెంబర్ 8712667434 కాల్ చేయాలని సూచించారు. కాల్ చేసిన వారి పేర్లు వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ స్పెషల్ ఆఫీసర్ స్వాతి, మరియు ఉపాధ్యాయులు, సిద్దిపేట షీటీమ్ బృందం కిషన్, ఏఎస్ఐ, మహిళ కానిస్టేబుల్ మమత, కానిస్టేబుళ్లు ప్రవీణ్, లక్ష్మీనారాయణ.
తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *