హుస్నాబాద్ లో అంగరంగ వైభవంగా “సద్దుల బతుకమ్మ”

హుస్నాబాద్ లో అంగరంగ వైభవంగా “సద్దుల బతుకమ్మ”

హుస్నాబాద్ లో అంగరంగ వైభవంగా “సద్దుల బతుకమ్మ”

వర్షంలో సైతం ఉత్సాహంగా సాగిన బతుకమ్మ సంబరాలు..

కిక్కిరిసిన ట్రాఫిక్ స్వయంగా వాహనాలను క్లియర్ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో, హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఒకవైపు భారీ వర్షం సైతం లెక్కచేయకుండా మహిళలు చిన్న పెద్ద తేడా లేకుండా బతుకమ్మ పాటలు, కోలాటాలతో ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నారు. వర్షంలో సైతం ఒక్కరిని మహిళను ఆత్మీయంగా పలకరించుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటూ ముందుకు సాగారు. ఎల్లమ్మ చెరువు వద్ద బతుకమ్మ ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేశారు. చెరువు వద్ద బతుకమ్మలు వేసే సందర్భంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అక్కడ ప్రత్యేక పోలీసులతో పాటు గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. విద్యుత్ దీపాల వెలుగుల మధ్య మహిళలు పోయి రా బతుకమ్మ ..మళ్ళీ రా బతుకమ్మ అంటూ వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. వర్షంలో బతుకమ్మలు తీసుకొని ఒకేసారి కదలడంతో ఎల్లమ్మ చెరువు వైపు వాహనాలు, బతుకమ్మ ను తీసుకెళ్తున్న పాదచారులతో కిక్కిరిసిపోయింది. మంత్రి పొన్నం ప్రభాకర్ పోలీసులకు సూచనలు చేస్తూ తానే స్వయంగా వాహనాలను ట్రాఫిక్ క్లియర్ చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ రూట్ల ద్వారా వాహనాలను మళ్లించారు.

అంతకుముందు మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో సుడిగాలి పర్యటన చేశారు. సద్దుల బతుకమ్మ పండగ నేపథ్యంలో వెంకెపల్లి సైదాపుర్ లో బతుకమ్మ ఘాట్ లను, ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం దుర్గామాత భవాని మండపాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సైదాపూర్ నుండి జాగిరిపల్లి వెళ్తుండగా కల్వర్టు ఇబ్బందులు ఉండడంతో బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేయడానికి ఎస్టిమెట్ చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జాగిరిపల్లి లో దుర్గామాత అమ్మవారిని దర్శించుకున్నారు. రామచంద్రపురం లో బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించారు. ఎల్కతుర్తి మండల కేంద్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. రోడ్డు పై పండగ సందర్భంగా మహిళలు, వృద్ధులతో ముచ్చటించారు. ములకనూరు లో బతుకమ్మ పండగ ఏర్పాట్లను పరిశీలించారు. ములకనూరు లో ఇటీవల అనారోగ్యానికి గురైన  మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య గారి సోదరి మాజీ ఎంపిపి సరోజ ను పరామర్శించి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు.

పొన్నం సత్తయ్య గౌడ్ స్మారకార్థం కొత్తకొండ లో నిర్మితమవుతున్న ధ్యానమందిరంను పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని సూచించారు. అక్కన్నపేట లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామస్థులతో ముచ్చటించారు. అక్కన్నపేటలో బతుకమ్మ పండగ ఏర్పాట్లను పరిశీలించారు. చెరువుల వద్ద జాగ్రతగా ఉండాలని అధికారులను ఆదేశించారు. బతుకమ్మ లు తీసుకుపోతున్న మహిళలతో ముచ్చటించి వారికి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *