తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షునిగా గెలిపించండి

తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షునిగా గెలిపించండి


తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షునిగా గెలిపించండి….

అర్హులైన పద్మశాలి కుల బాంధవులకు ప్రభుత్వ లబ్ధిపథకాలు అందేలా కృషి చేస్తాను…

ఈ నెల 18, ఆదివారం నిర్వహించే ఎన్నికల్లో రాట్నం గుర్తుపై ఓటు వేసి గెలిపించండి…

రాష్ట్ర అధ్యక్ష పదవి అభ్యర్థి సిద్దిపేట వాసి బూర మల్లేశం

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక సందర్భంగా హుస్నాబాద్ మండల, పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని శివ భక్త మార్కండేయ దేవాలయంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పోటీ చేయుచున్న బూర మల్లేశం కు ఘన స్వాగతం పలికిన  పద్మశాలి సంఘం నాయకులు. ముందుగా దేవాలయంలోని శివ భక్త మార్కండేయ, సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీస్సులు తీసుకున్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన ఎన్నికల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షునిగా పోటీ చేయుచున్న బూర మల్లేశం మాట్లాడుతూ… సిద్దిపేట వాస్తవ్యుడనని, ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ పొందానని, జిల్లాలో ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా మా కుటుంబ సభ్యులు గత ప్రభుత్వంలో పనిచేశారని, నేను కూడా పదవీ విరమణ అనంతరం రాజకీయాలలో చురుగ్గా పాల్గొంటున్నానని, గత 50 సం.రాలుగా పద్మశాలి సంఘం అభివృద్ధికి సంఘం నాయకులను, కుల బాంధవులను సంఘటితం చేసి సంఘం అభివృద్ధికి, విలువలు కాపాడుకోవడం కోసం ప్రజాస్వామ్యయుత పద్ధతిలో ఎన్నికల ద్వారా పోటీలో గెలవాలని కోరుకుంటున్నానని, రాష్ట్రంలో ఓకే పద్మశాలి సంఘం ఉండాలని 33 జిల్లాల సంఘ నాయకులతో తీర్మానం చేయించి, నిర్ణయించామని తెలిపారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పద్మశాలి కుల బాంధవులకు ప్రభుత్వ లబ్ధి పథకాలను, అన్ని రకాలైన సేవలను ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి గతంలో లబ్ధి చేకూర్చానని, రాష్ట్రమంతటా సంఘం తరఫున సేవా కార్యక్రమాలు నిర్వహించానని, ఈనెల 18  ఆదివారం నాడు జరగబోయే అధ్యక్షుని ఎన్నికల్లో నాకు కేటాయించిన రాట్నం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, రాబోయే రోజుల్లో మన సంఘం అభివృద్ధి చెందె కొరకు గెలిపించాలని కుల బాంధవుల ఓటర్లను కోరారు.

హుస్నాబాద్ మండలంలో167, అక్కన్నపేట మండలంలో 146, కోహెడ మండలంలో 123,
మొత్తం కలిపి 436 ఓట్లు ఉన్నాయని, మీరందరూ ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. పట్టణ,మండల, జిల్లా బాధ్యులు ఓటర్లకు అవగాహన కల్పించి అందరూ పాల్గొనేటట్లు కృషి చేయాలని, హుస్నాబాద్ శివ భక్త మార్కండేయ ఆలయంలోనే పోలింగ్ కేంద్రం నిర్వహిస్తారని, ఓటు కేటాయించిన వారందరూ ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డుతో వచ్చి ఓటు వేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అతిథులుగా పద్మశాలి సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కస్తూరి సతీష్, ప్రచార కార్యదర్శి ముదిగొండ శ్రీనివాస్, ఎన్నికల ఇన్చార్జి జోగు బిక్షపతి పాల్గొని ఎన్నికల నియమావళిని, ఓటు విలువను, సంఘం అభివృద్ధికి తోడ్పడాలని, రాష్ట్రంలో ఒక ప్రత్యేక గుర్తింపును పెంపొందించేందుకు ఈ ఎన్నిక అవసరంగా ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం హుస్నాబాద్ పట్టణ అధ్యక్షులు కోమటి సత్యనారాయణ, మండల అధ్యక్షులు బూర్ల రాజయ్య, జిల్లా సలహాదారు గాజుల భగవాన్ నేత, డివిజన్ ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి బాలయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ సతీష్, జిల్లా కార్యదర్శి గోలి వెంకటనారాయణ, జిల్లా సహాయ కార్యదర్శి కోమటి నారాయణ, మోర శ్రీహరి, శిలాపురం రమేష్, పద్మశాలి సంఘం నాయకులు ఇప్పకాయల సహదేవ్, వడ్డేపల్లి లక్ష్మణ్,గుండ్లపల్లి కనకయ్య, కొండి గణపతి, వైద్యం సుధాకర్, బూర్ల సత్యనారాయణ, చిత్రాల నరసింహస్వామి, అక్కన్నపేట, కోహెడ మండల పద్మశాలి సంఘం నాయకులు, మహిళ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *