ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో “స్వచ్ఛదనం పచ్చదనం”

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో “స్వచ్ఛదనం పచ్చదనం”

మొక్కలు నాటడం వల్ల ఉష్ణోగ్రత మరియు కాలుష్యం తగ్గుతుంది

‘డ్రై డే ఫ్రైడే’ మరియు వనమహోత్సవ కార్యక్రమాలలో చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

హుస్నాబాద్ పట్టణంలో “స్వచ్ఛదనం పచ్చదనం” ఐదవ రోజు పురపాలక సంఘ ఆధ్వర్యంలో ‘డ్రై డే ఫ్రైడే’ మరియు వనమహోత్సవ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పురపాలక సంఘ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న  హాజరై 7 వ వార్డులోని డిపో వెనుక కాలనీలో, 1 వ వార్డులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటడం, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో శ్రమదాన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ పట్టణ ప్రజలందరూ మొక్కలు నాటి సంరక్షించాలని, ప్రతిరోజు రెండు సార్లు మొక్కలకు నీళ్లు పోయాలని, మొక్కలు నాటడం వల్ల ఉష్ణోగ్రత మరియు కాలుష్యం తగ్గుతుందని, కాలుష్యం తగ్గడం వల్ల పర్యావరణం మెరుగుపడుతుందని, సీజనల్ వ్యాధులు అనగా డయేరియా, మలేరియా, టైఫాయిడ్ రాకుండా ఇంట్లో నిల్వ ఉన్న నీటిని తొలగించుకోవాలని, ఎప్పటికప్పుడు రోడ్లకు ఇరువైపు లో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించుకోవాలని, హుస్నాబాద్ పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దుకోవాలని దానికి ప్రజల  సహకారం అవసరమని, పట్టణ ప్రజలందరూ స్వచ్ఛతను పాటించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కమిషనర్ మల్లికార్జున్ గౌడ్, వైస్ చైర్పర్సన్ అనిత రెడ్డి, కౌన్సిలర్లు నళిని దేవి, రమా దేవి, స్వర్ణలత, భాగ్య రెడ్డి, లావణ్య, పద్మ, వేణు, ఎం.శ్రీనివాస్, రవి, దొడ్డి శ్రీనివాస్,గుళ్ళ రాజు, కల్పన, సరోజన, రత్నమాల, వల్లపు రాజు, రమేష్, హరీష్, సుప్రజ, కో ఆప్షన్ మెంబెర్స్ శంకర్ రెడ్డి, అయుబ్, శ్రీలత, లలిత, మున్సిపల్ అధికారులు, ఉపాధ్యాయ బృందం, వార్డ్ ఆఫీసర్లు, మెప్మా రిసోర్స్ పర్సన్, వైద్య సిబ్బంది, డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్, మున్సిపల్ సిబ్బంది మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *