న్యాయవాదులపై పోలీసుల భౌతిక దాడులను నిరసిస్తూ హుస్నాబాద్ కోర్టు ఎదుట న్యాయవాదుల నిరసన
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
న్యాయవాదులపై పోలీసుల భౌతిక దాడులను నిరసిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు ఎదుట న్యాయవాదులు నిరసన వ్యక్తం చేస్తారు. జనగామ లోని పోలీస్ స్టేషన్ లో న్యాయవాద దంపతులపై పోలీసుల దాడిని ఖండిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. సిద్దిపేట, సిరిసిల్లలో న్యాయవాదులపై పోలీసులు చేసిన దాడులను మరవకముందే, నిన్నటి రోజున జనగామలో కేసు విషయమై పోలీస్ స్టేషన్ కు వెళ్లిన న్యాయవాద దంపతులను సిఐ, పోలీస్ సిబ్బంది దురుసుగా మాట్లాడి వారిపై దాడికి పాల్పడడాన్ని న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. పోలీస్ స్టేషన్ పోలీసుల సొంతిల్లు కాదని, కేసుల విషయమై మాట్లాడడానికి న్యాయవాదులు పోలీస్ స్టేషన్ కు వెళితే వారిపై దాడులకు పాల్పడడం ఏంటని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే ప్రభుత్వం, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇకపై న్యాయవాదులపై ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు.