అధికారులే సమస్యలను పరిష్కరించాలి.. మంత్రి పొన్నం

అధికారులే సమస్యలను పరిష్కరించాలి.. మంత్రి పొన్నం

గ్రామాల్లో ప్రజా ప్రతినిధులు క్షేత్ర స్థాయిలో లేరు.. అధికారులే సమస్యల పరిష్కారానికి అప్రమత్తంగా ఉండాలి.

50 రోజుల్లో ప్రైవేట్ భవనాల్లో నడిచే ప్రభుత్వ కార్యాలయాలకు స్థల సేకరణ పూర్తి చేయాలి

ధరణి, భూ వివిధ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలి.

8 వ తేది నుండి నియోజకవర్గంలోని  రైతుల సమస్యలు, ఆయా గ్రామాల్లో ఉన్న అన్ని సమస్యల పై రైతు వేదికల వద్దకే  అధికారులు

-హుస్నాబాద్ నియోజకవర్గ  అభివృద్ధి సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

మండలాల్లో, గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో ప్రజా ప్రతినిధులు లేకపోవడంతో నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడకుండా ప్రజలకు ఏ సమస్య వచ్చిన మండలాన్ని ఒక యూనిట్ గా తీసుకొని అధికారులే సమస్యలను పరిష్కరించాలని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ది పై ఇంటిగ్రేటెడ్ అఫీసేస్ కాంప్లెక్స్ హుస్నాబాద్ లో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సమావేశానికి రాని అధికారులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని  ఆదేశించారు. గ్రామాల్లో ఉన్న సమస్యలు మండల అధికారుల దగ్గర పరిష్కారం అయ్యేవి పూర్తి చేయాలని ఇతర సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

ఈ నెల 8 వ తేది నుండి నియోజకవర్గంలోని 7 మండలాల్లో ఉన్న 42 రైతు వేదికల వద్దకి స్వయంగా తానే వచ్చి రైతుల సమస్యలు, గ్రామాల్లో ఉన్న సమస్యలు  రెవెన్యూ, ఐకెపి, హెల్త్, ఎడ్యుకేషన్, ఇలా ఏ సమస్య ఉన్న అక్కడికి వచ్చి తెలుసుకుంటానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ రైతు వేదికల వద్ద జరిగే సమావేశానికి మండల యూనిట్ లో ఉన్న ప్రతి అధికారి విధిగా హాజరుకావాలని సూచించారు. వచ్చే 50 రోజుల్లో నియోజకవర్గంలోనీ ప్రైవేట్ భవనాల్లో నడిచే ప్రభుత్వ కార్యాలయాలకు స్థల సేకరణ పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. అక్టోబర్ లో గాంధీ జయంతి తరువాత మరో సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రోగ్రెస్ తెలుసుకుంటానని సూచించారు. ధరణి, భూ వివాధ సమస్యలపై ఆర్డీవో, మండల స్పెషల్ ఆఫీసర్, ఎమ్మార్వో సమన్వయం చేసుకొని భూ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. నియోజకవర్గంలో ప్రతి కార్యాలయంలో అధికారులు విధిగా సమయ పాలన పాటించాలని వారి పనితీరు పై ఇంటెలిజెన్స్ నివేదిక తెప్పించుకుంటానని పేర్కొన్నారు.

నియోజకవర్గంలో ఉన్న ఏంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్, హాస్టల్ వార్డెన్ లతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని తమ ప్రభుత్వం ప్రతి స్కూల్ కి ఉచిత విద్యుత్, ఉచిత డ్రింకింగ్ వాటర్, అమ్మ ఆదర్శ పాఠశాలలకి  శానిటేషన్ కోసం ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. ఇప్పటికే 25 వేల పాఠశాలలకు 1100 కోట్ల రూపాయలు కేటాయించి మౌలిక వసతులు కల్పించామన్నారు. మండల విద్యాధికారులకు ఒకే మండలం ఉండాలని అదనపు మండల్ ఉంటే దానినీ తొలగించాలని జిల్లా అధికారులకు సూచించారు.

వర్షాకాలం సీజనల్ వ్యాధులైన  మలేరియా, టైఫాయిడ్ డెంగ్యూ , చికెన్ గున్యా లాంటి వ్యాధులు రాకుండా వైద్యాధికారులు ముందస్తు అప్రమత్తంగా  ఉండాలని   అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ముఖ్యంగా హుస్నాబాద్ లో బీపీ టాబ్లెట్స్ వాడుతున్న వారికి కిడ్నీ లు ఫెయిల్ అయి డయాలసిస్ కేసులు అధికంగా  వస్తున్నాయని దీనిపై ఇప్పటికే రాష్ట్ర వైద్య శాఖ దృష్టికి తీసుకెళ్ళనని దానికి గల కారణాలు పై అధ్యయనం చేయాలని వైద్యులకు సూచించారు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తమ ప్రభుత్వం ప్రజా పాలన లో ఇప్పటికే గ్యారంటీ స్కీమ్స్ అమలు చేస్తున్నామని ఎవరికైనా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కి గ్యాస్ రాకుంటే ఎడిట్ ఆప్షన్ లో మళ్ళీ నమోదు చేసుకోవాలని సూచించారు.  ఇప్పటి వరకు లక్షా 50 వేల వరకు ఉన్న వారికి రైతు రుణమాఫీ అమలు చేశామని ఎవరికైనా రైతు రుణమాఫీ రాని వారి వివరాలు AEO లు సేకరించాలని ఆదేశించారు. నియోజకవర్గంలో ఏ గ్రామంలో కూడా నీటి సమస్య రాకూడదని మోటార్లు కాలిపోతే అలాంటి సమస్యలు ఏమున్నా తన sdf నుండి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. రైతుభీమా పై రైతుల సమాచారం తెలుసుకోవాలి. త్వరలోనే రైతు భరోసా పై తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబుతుందనీ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు దీనిపై ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందని గుర్తు చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే పంట నష్టపరిహారాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతు నేస్తం కింద రైతు వేదికల వద్ద రైతులకు అవగాహన కల్పించాలనీ సూచించారు. నియోజకవర్గంలో పిఎం కిసాన్ నిధి ఎంత మందికి వర్తిస్తుందని ఆరా తీశారు. ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్, స్మశాన వాటిక కు లాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలన్నారు. ఉపాధి హామీ ద్వారా వన మహోత్సవం లో భాగంగా మొక్కలు నాటి సంరక్షించాలని  ,స్వచ్చ ధనం – పచ్చ ధనం కార్యక్రమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలని సూచించారు.

50 రోజుల్లో 500 ఎకరాలు హార్టి కల్చర్ లో భాగంగా డ్రాగన్ ఫ్రూట్, ఆయిల్ ఫార్మ్ , మామిడి పై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ లో ఎన్జీటీ కేసులు ఉన్న హెడ్ వర్క్స్ కాకుండా కాలువల పనులకు భూసేకరణ  చేసి త్వరగా పూర్తి చేయాలన్నారు. భిమదేవరపల్లి మండలంలో కుక్కల బెడద పై ఏబీసీ కమిటీ వేసి కుక్క కాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో ఆర్డీవోలు, మండలాల ప్రత్యేక అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *