టి20 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ ఘన విజయం పై హర్షం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట టైమ్స్ డెస్క్:
టి20 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ ఘన విజయం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. 17 ఏళ్ల నిరీక్షణ తరువాత టీ -20 వరల్డ్ కప్ లో భారత్ విజయం పట్ల తనకు సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ బృందానికి అభినందనలు తెలిపారు. భారత్ టి -20 ప్రపంచ కప్ గెలవడం పట్ల దేశ ప్రజలకు, క్రికెట్ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం రేపటి భవిష్యత్ క్రీడాకారులను మరింత ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుందని ఆకాక్షించారు.