స్వచ్ఛ సర్వేక్షన్ పై ప్రజలకు అవగాహన

స్వచ్ఛ సర్వేక్షన్ పై ప్రజలకు అవగాహన

హుస్నాబాద్ పట్టణంలోని నాలుగో వార్డ్ లో స్వచ్ఛ సర్వేక్షన్ 2024 కార్యక్రమంలో భాగంగా బేసిల్ ఫౌండేషన్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో తడి చెత్త , పొడి చెత్త మరియు హానికరమైన చెత్త పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పురపాలక సంఘ చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకన్న హాజరై ప్రజలకు అవగాహన కల్పించారు. 

పురపాలక సంఘ చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రతి ఇంటి యజమానులు చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనానికి అందించాలని, ఇంటి స్థలం ఉన్నవాళ్లు వారి ఇంట్లోనే తడి చెత్త తో ఎరువు తయారు చేసుకోవచ్చని, తయారుచేసిన ఎరువును మొక్కలకు వాడుకోవాలని, పొడి చెత్తను మున్సిపల్ వాహనానికి అందిస్తే రీసైక్లింగ్ లేదా రియూజ్ చేసుకోవచ్చని, సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడడం వల్ల భూ కాలుష్యం పెరిగి పర్యావరణానికి హాని కలుగుతుందని, మార్కెట్ కు వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ కవర్లో బదులు సంచులను వాడాలని, ఇకనుండి చెత్త వేరు చేసి ఇవ్వకపోతే జరిమాన విధిస్తామని తెలియజేయడం జరిగింది. వార్డ్ లోని ప్రజలందరికీ బేసిల్ ఫౌండేషన్ సంస్థ వారు తయారు చేసిన పాంప్లెంట్ పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ అనిత రెడ్డి, కమీషనర్ మల్లిఖార్జున్, సానిటరీ ఇన్స్పెక్టర్ బాల ఎల్లం, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ రవికుమార్, వార్డ్ అధికారి వెంకటేష్, బేసిల్ ఫౌండేషన్ ఫౌండర్ ఉదయ్, బేసిల్ ఫౌండేషన్ సూపర్వైజర్ నవీన్, వార్డ్ ఆర్పి శోభ, జవాన్ ప్రభాకర్, వార్డ్ ప్రజలు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *