30 సంవత్సరాల వేడుకల సందర్భంగా రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ

30 సంవత్సరాల వేడుకల సందర్భంగా రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ

30 సంవత్సరాల వేడుకల సందర్భంగా రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసిన మిత్ర బృందం

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ :

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన 1993-94 పదవతరగతి పూర్వ విద్యార్థిని, విద్యార్థుల 30 సంవత్సరాల వేడుకల సందర్బంగా సోమవారం రోజు మిత్రుల ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1993-94 మిత్ర బృందం తరపున సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ముఖ్యంగా అంధులకు, వికలాంగులకు, వృద్దులకు సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిత్రులు వరయోగుల మురళీధర్ స్వామి,మహమ్మద్ ఖుద్రత్ అలీ, మేకల ఎల్లయ్య, అక్కు పూర్ణచందర్, బోయిని సమ్మరాజు, చెప్యాల వెంకటేష్ గౌడ్,కాసనగొట్టు శ్రీనివాస్,గడిపె రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *