గౌరవెల్లి ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్ త్వరగా పూర్తి చేయండి-మంత్రి పొన్నం ప్రభాకర్

గౌరవెల్లి ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్ త్వరగా పూర్తి చేయండి-మంత్రి పొన్నం ప్రభాకర్

భూమి సర్వే మరియు  పెగ్ మార్కింగ్ ను జులై 10వ తేదీలోగా పూర్తి చేయండి

మిగతా 5 శాతం డ్యాం పూర్తి చేసేందుకు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ అనుమతి తీసుకోండి

డ్యామ్ లో మత్స్య సంపదను అభివృద్ధి పరిచేలా చర్యలు తీసుకోవాలి

గౌరవెల్లి ప్రాజెక్టు ఏరియా పర్యాటకరంగ అభివృద్ధికి చాలా అనువైన ప్రాంతం

రెవెన్యూ మరియు ఇరిగేషన్ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట టైమ్స్ డెస్క్:

శనివారం సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరితో కలిసి గౌరవెల్లి ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నిర్మాణంపై  రెవెన్యూ మరియు ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణం 95% పూర్తయినందున  గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చుటకు పంట పొలాలకు త్వరగా సాగునీరు సరఫరా చేసేందుకు  అవసరమైన డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నిర్మాణాలకు అవసరమైన అక్కన్నపేట మండలంలో 132 ఎకరాలు, హుస్నాబాద్ మండలంలో 235 ఎకరాలు మరియు కోహెడ మండలంలో 304 ఎకరాల  భూమి సర్వే మరియు  పెగ్ మార్కింగ్ ను జులై 10వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. రెవిన్యూ మరియు ఇరిగేషన్ అధికారులు ఈ పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మళ్లీ జూలై 11వ తేదీన సమావేశం నిర్వహిస్తానని తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ 95% పూర్తయినందున మిగతా 5 శాతం పూర్తి కాకపోతే  వర్షాకాలంలో డ్యాంకు ఇబ్బంది కలుగుతుందని మిగతా 5 శాతం పూర్తి చేసేందుకు అనుమతి కోసం నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ను కోరాలని అధికారులకు సూచించారు.

హుస్నాబాద్ నియోజకవర్గంలో ఇరిగేషన్ శాఖ కింద 500కు పైగా చెరువులు ఉన్నాయని, గౌరవెల్లి ప్రాజెక్టు రైట్ కెనాల్ 47 కిలోమీటర్లు మరియు లెఫ్ట్ మెయిన్ కెనాల్ 14 కిలోమీటర్ల ద్వారా హుస్నాబాద్ నియోజకవర్గంలోని చెరువులకు సాగునీరు సరఫరా చేసేందుకు అవసరమైన పనులను మూడు కేటగిరీలుగా గుర్తించి పనులను చేపట్టాలని అన్నారు. మెయిన్ కెనాల్ లో నీరు వస్తే రైతులకు నమ్మకం పెరిగి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ త్వరగా నిర్మాణం అయ్యేందుకు సహకరిస్తారని అన్నారు. కోహెడ సైడ్ వెళ్లే మెయిన్ కెనాల్  నిర్మాణంలో ఉన్న నాలుగు వరుసల జాతీయ రహదారిని క్రాస్ చేసే ప్రాంతాన్ని ముందస్తుగా నేషనల్ హైవే వారికి తెలియజేయాలని అన్నారు.

గౌరవెల్లి ప్రాజెక్టు కింద కవర్ కాని హుస్నాబాద్ నియోజకవర్గంలోని గ్రామాలకు, దేవాదుల, రంగనాయకసాగర్ ల ద్వారా సాగునిరందించేందుకు ప్రణాళికలు వేయాలన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు ఏరియా పర్యాటకరంగ అభివృద్ధికి చాలా అనువైన ప్రాంతమని, గౌరవెల్లి ప్రాజెక్టు ఏరియాలో  ప్రభుత్వ భూములను గుర్తించి  నివేదిక అందజేయాలన్నారు.

అదేవిదంగా హుస్నాబాద్ ప్రాంతంనుండి ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేలా మత్స్య సంపదను అభివృద్ధి పరిచేలా చెర్యలు తీసుకోవాలని జిల్లా మత్స్యశాఖ అధికారి మల్లేశం ను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ శ్రీనివాసరెడ్డి, ఇరిగేషన్ ఇ ఎన్ సి కరీంనగర్ శంకర్,  హుస్నాబాద్ ఆర్డిఓ రామ్మూర్తి, సిద్దిపేట ఆర్డీవో సదానందం, హుస్నాబాద్ ఇరిగేషన్ డివిజన్ ఈఈ డివిజన్ 3  ఈ రాములు, ఇఇ డివిజన్ 4 రమేష్, డిఇ లు, సంబంధిత మండలాల తాసిల్దారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *