నీట్ పరీక్షా పత్రం లీకేజి పై.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపాలి..-మెదక్ ఎమ్మెల్యే  మైనంపల్లి రోహిత్

నీట్ పరీక్షా పత్రం లీకేజి పై.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపాలి..-మెదక్ ఎమ్మెల్యే  మైనంపల్లి రోహిత్

నీట్ పరీక్షా పత్రం లీకేజి పై.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపాలి..
24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేంద్రప్రభత్వం చెలగాటం..
విద్యార్థులకు అండగా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది..
మతాల పేరుతో రాజకీయాలు చేయడం మాననుకోవాలి..
మెదక్ ఎమ్మెల్యే  మైనంపల్లి రోహిత్

సిద్దిపేట టైమ్స్: మెదక్ ప్రత్యేక ప్రతినిధి;

నీట్ పరీక్షా పత్రం లీకేజి పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపాలని మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే  మైనంపల్లి రోహిత్ డిమాండ్ చేశారు. శుక్రవారం మెదక్ పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఏఐసిసి పిలుపుమేరకు నియోజక వర్గ కాంగ్రెస్ నేతలతో కలసి ,  నిరసన, ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసన సభ్యులు చిలుముల మదన్ రెడ్డి, నర్సాపూర్ నియోజక వర్గ ఇన్ ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, మెదక్ జిల్లా డిసిసి అధ్యక్షులు ఆంజనేయులు, చిలుముల సుహాసిని రెడ్డి, మెదక్ నియోజక వర్గంలోని ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా నీట్ పరీక్షా పత్రం లీకేజిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా నిలబడుతుందని ఆయన స్పష్టం చేశారు. మతాల పేరుతో బిజేపి పార్టీ రాజకీయాలు చేయడం మానుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మెన్ తొడుపునూరి చంద్రపాల్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గూడూరి ఆంజనేయులు, ఉప్పల రాజేష్, న్యాయవాది జీవన్ రావ్, బొజ్జ పవన్, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పబ్బతి ప్రభాకర్ రెడ్డి, గోవింద్ నాయక్, ఎంపిపి ప్రశాంత్ రెడ్డి,శ్రీమాన్ రెడ్డి, నిజాంపేట ఎంపిపి సిద్దిరాములు, ఆవుల గోపాల్ రెడ్డి, చిన్నశంకరంపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సాప సత్యనారాయణ, మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ గంగా నరేందర్, మనోజ్, హావేళి ఘణపురం మండల నాయకులు, లక్కరు శ్రీనివాస్, శేరి మహేందర్ రెడ్డి, సర్దన బాలకిషన్, మెదక్ పట్టణ కౌన్సిలర్ లు దొంతి లక్ష్మి ముత్యం గౌడ్, మేడి కళ్యాణి మదుసూదన్, షమీ, దాయర లింగం, హరిత, ఎస్.డి. జ్యోతి క్రిష్ణ, లక్ష్మినారాయణ గౌడ్, బొద్దుల రుక్మిణి క్రిష్ణ, రామాయంపేట మండల నాయకులు సుప్రబాత్ రావ్, బ్లాక్ కాంగ్రెస అధ్యక్షులు రమేశ్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, సాకేత్, దామ యాదగిరి, నిజాంపేట మండల నాయకులు వెంకట్, నజీర్, మెదక్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ చౌదరి, మందుగుల గంగాధర్, పద్మారావ్, శ్రీకాంత్, లల్లూ, బన్ని, నాగరాజు, భరత్ గౌడ్, దేవుల, అమీర్, అహ్మద్, మొజాంబిల్, ఉన్న సూపి, ప్రేమ్ లతో పాటు వివిధ మండలాల కాంగ్రెస పార్టీ నాయకులు, కార్యకర్తలు  హాజరయ్యారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *