హుస్నాబాద్ లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

హుస్నాబాద్ లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల కేంద్రమైన అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏఐసీసీ యువ నాయకుడు పార్లమెంట్ మెంబర్ అయిన రాహుల్ గాంధీ 54వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఇట్టి జన్మదిన వేడుకల్లో టపాసులు పేలుస్తూ స్వీట్ల పంపిణీ చేసి కేక్ కట్ చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి రాహుల్ గాంధీ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు బంక చందు మాట్లాడుతూ… యువ నాయకుడు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 4000 కిలోమీటర్లు పాదయాత్ర  నడిచిన నాయకుడు రాహుల్ గాంధీ అని బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ కి చుక్కలు చూపించి కాంగ్రెస్ పార్టీకి జలసత్వాలు అందించారన్నారు..

ఈరోజు బిజెపి ప్రభుత్వం నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు గనుక మద్దతు ఇవ్వకుంటే ఇవ్వాలా బిజెపి ప్రభుత్వం లేదు ఇది ఐదేళ్లు కొనసాగుతుందో లేదో అని ప్రజలు మాట్లాడుకోవడం జరుగుతుంది అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెగా జాబు మేలా అనే ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుంది అని, ఇట్టి కార్యక్రమం ఈనెల 24 వ తారీఖున హుస్నాబాద్ మండల కేంద్రంలోని సిద్దిపేట్ రోడ్డు లో గల తిరుమల గార్డెన్ లో ఇట్టి మెగా జాబు మేలను నిర్వహించడం జరుగుతుంది చదువురాని యువకులు మరియు చదువుకున్న యువకులు కూడా ఇట్టి జాబు మేళలో పాల్గొని మీ మీ అర్హతకు తగ్గ జాబులు ఎంచుకొని అందరూ ఉద్యోగ రీత్యా సెట్ కావాలని కోరుకున్నారు.

మన హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రివర్యులైన పొన్నం ప్రభాకర్  యువత చెడు మార్గంలో వెళ్లొద్దు అని ఎలాంటి పనులు లేక యువత ఇబ్బందులకు గురవుతున్నారని తెలుసుకొని ప్రజా పరిపాలన ప్రభుత్వం దిశగా ఈ పరిపాలన కొనసాగుతుందని మాట్లాడడం జరిగినది
ఇట్టి అవకాశం కల్పిస్తున్న మన మంత్రివర్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో టిపిసిసి మెంబర్ కేడం లింగమూర్తి. హుస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బంక చందు, హుస్నాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ, కౌన్సిలర్స్ సరోజన, పున్నసది లావణ్య, ఎం.డి హసన్, మడప యాదవ రెడ్డి, వెన్న రాజు, బొంగుని శ్రీనివాస్, పోతుగంటి బాలయ్య, బూరుగు కిష్ట స్వామి
బిఖ్యా నాయక్, సంఘ కుమార్,  బెజ్జంకి బాబు, పూలు సంపత్, జవహర్లాల్, కమలహాసన్, మామిడి తిరుపతి, మరియాల రాజిరెడ్డి, కేశవని రమేష్ రమేష్, నాయక్ పూదరి శ్రీనివాస్ గౌడ్. జిల్లా రమేష్, బోనగిరి రజిత దండి  లక్ష్మి, నాయిని రజిత, కమలమ్మ, పచ్చిమట్ల అశోక్, దండి కొమురయ్య, ముప్పిడి రాజిరెడ్డి, చీకట్ల రాజయ్య, బ్యాంకు బాలన్న, గడిపే బాలు, దొంతర వేణి శ్రీనివాస్, బూరుగు సతీష్, పంపరి సంపత్, కొడుముంజ మహేందర్, సుంకరి ప్రదీప్, పప్పు వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *