హిందువులకు, ముస్లీంలకు వేరు వేరు న్యాయాలా.. మెదక్ ఎంపీ రఘునందన్

హిందువులకు, ముస్లీంలకు వేరు వేరు న్యాయాలా.. మెదక్ ఎంపీ రఘునందన్

హిందువులకు, ముస్లీంలకు వేరు వేరు న్యాయాలా

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన పోలీసులను సస్పెండ్ చేయాలి

ఫోన్ ట్యాపింగ్ పోలీసులకు జైలు గతి పట్టింది
తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చూడండి

మీడియా సమావేశంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు….


సిద్దిపేట టైమ్స్, మెదక్ ప్రత్యేక ప్రతినిధి:

మెదక్ ఘటనలో హిందువులకో ముస్లింలకు ఓ న్యాయం హిందువుల ఓ న్యాయం అన్నట్లుగా పోలీసులు ప్రవర్తించారని ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. ఈ ఘటనలో నిరక్ష్యంగా వ్యవహారించిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మెదక్ అల్లర్లలో అరెస్ట్ అయిన బీజేపీ కార్యకర్తలను మెదక్ సబ్ జైల్లో పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, జరుగుతున్న సంఘటనల పట్ల పోలీసులను అప్రమత్తం చేసిన పోలీసులు పట్టించుకోకపోవడం దుర్మార్గమైన చర్య అన్నారు.  స్థానికంగా ఉన్న మహిళా ఏఎస్ఐను బూతులు తిడితే కూడా కనీసం కేసు నమోదు చేయని దుస్థితిలో  పోలీసు యంత్రాంగం ఉందన్నారు. చట్టం ముందు అందరూ సమానమే అనే పదాన్ని మేము గౌరవిస్తున్నాము కానీ పోలీసులు గౌరవిస్తలేరన్నారు. ఎవరిమెప్పుల కోసమో, పోస్టింగ్ ల కోసమో ఎవరిని కాపాడుకోవడం కోసం కుట్రలు కుతంత్రాల చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజల ముందు ఒక చర్చకు ఉంచాలనే ఉద్దేశంతో కోర్టు ముందు  మాట్లాడుతున్నా అని అన్నారు.

14 మందిని పట్టుకొచ్చి టౌన్ పోలీస్ స్టేషన్ లో పెట్టడం కాదు ఏఎస్ఐ ని బూతులు తిట్టిన వారిని పట్టుకొస్తే మీ యూనిఫామ్ కు విలువ ఉంటుందన్నారు. పోలీస్ అధికారులు డ్యూటీ చేస్తే సరిగా చేయండి చేతకాకపోతే సెలవు తీసుకొని వెళ్లాలని సూచించారు. పిర్యాదు చేసిన వ్యక్తి నీ ఎవరి మేప్పు కోసం ప్రవేట్ ఆసుపత్రిలో ఉంచుతున్నారని, ఆయన ఉర్దూలో ఫిర్యాదు చేస్తే దాన్ని తెలుగులోకి కానిస్టేబుల్ తర్జుమా చేస్తారా అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ లో  చాలామంది ఉత్సాపడి ప్రస్తుతం ఎక్కడున్నారో గుర్తు పెట్టుకోవాలన్నారు. మెదక్ లో ఉన్న టౌన్, రూరల్  సీఐలకు మీ వీడియోల సీసీటీవి ఫుటేజిలను జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు అందజేసి న్యాయం జరిగే విధంగా చూడాలని ఎస్పీని కోరుతానన్నారు. ఐజి రంగనాథ్ కరీంనగర్, వరంగల్ లో ఎక్కువ ఉత్సాహం చూపించి బీజేపీ చేతిలో భంగపడ్డారని గుర్తుచేశారు. ఆరిఫ్ అనే వ్యక్తిని సాయంత్రం వరకు ప్రైవేటు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసి రిమాండ్ చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేయడం పోలీసులకు చేతకాకపోతే యూనిఫామ్ వేసుకోవడం బంద్ చేయాలన్నారు.

ఎస్పీ బాలస్వామి తో ఎంపీ రఘునందన్ …చర్చలు….

మీడియా సమావేశం అనంతరం నేరుగా ఎంపీ రఘునందన్ రావు ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఎస్పీ బాలస్వామి తో అక్రమ అరెస్టుల పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎస్పీ బాలస్వామి సహితం అదే స్థాయిలో సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.
దాదాపు 40 నిమిషాలు ఎస్పీ ఇతర అధికారులతో ఎంపీ మాట్లాడారు. మైనర్ లను,అక్రమంగా టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించి ఫోన్ లు లాక్కొని స్టేషన్ లో కూర్చో బెడుతున్నారని బాదితుల తల్లిదండ్రులు ఎంపీ దృష్టికి తెచ్చారు.అక్కడే ఉన్న డిఎస్పీని విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *