నాలుగు జిల్లాలకు ప్రధాన కేంద్రంగా హుస్నాబాద్ మారాలి

నాలుగు జిల్లాలకు ప్రధాన కేంద్రంగా హుస్నాబాద్ మారాలి

నాలుగు జిల్లాలకు ప్రధాన కేంద్రంగా హుస్నాబాద్ మారాలి

మున్సిపాలిటీ భవనంకు బొప్పరాజు లక్ష్మీకాంత రావు పేరు ను పెట్టాలి

ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యాలయం వేదిక కావాలి

మున్సిపాలిటీకి వచ్చే ప్రజలకు మార్గదర్శకంగా అధికారులు వ్యవహరించాలి

నూతన పురపాలక సంఘం భవనాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో నూతనంగా నిర్మించిన పురపాలక సంఘ భవనాన్ని గురువారం రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మను చౌదరితో కలిసి చైర్మన్ ఆకుల రజిత, కమిషనర్ మల్లికార్జున్ లను వారి చైర్ల లో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ…నూతన మున్సిపల్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.  ఈ ప్రాంత అభివృద్ధికి ప్రారంభకులు బొప్పరాజు లక్ష్మీకాంత రావు లాంటి వారంతా హుస్నాబాద్ అభివృద్ధిలో మంచి పాత్ర పోషించారని, పార్లమెంటు సభ్యుడుగా ఉన్నప్పుడు హుస్నాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలు ఏర్పడ్డాయని, మున్సిపల్ భవన నిర్మాణానికి పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసి ఈరోజు ప్రారంభించుకున్నమని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యాలయం వేదిక కావాలని, మున్సిపాలిటీకి వచ్చే ప్రజలకు మార్గదర్శకంగా అధికారులు వ్యవహరించాలన్నారు. పాత మున్సిపాలిటీ లో అందరికీ ఉపయోగపడే విధంగా పోస్ట్ ఆఫీస్, రిజిస్ట్రేషన్ ఆఫీస్ లను తీసుకురావాలని, మున్సిపాలిటీ భవనంకు బొప్పరాజు లక్ష్మీకాంత రావు పేరు ను పెట్టాలని, బొప్పరాజు లక్ష్మీకాంత రావు నివాసాన్ని లైబ్రరీ కి ఉపయోగించుకోవాలని, అభివృద్ది నిరంతర ప్రక్రియ గతంలో పని చేసిన శాసన సభ్యులు, సర్పంచ్ లు, మున్సిపల్ చైర్మన్ లు, కౌన్సిలర్ లు, అధికారులు సమన్వయంతో పనిచేశారని అన్నారు. పక్కన ఉన్న కరీంనగర్, హనుమకొండ, సిద్దిపేట, జనగాం నాలుగు జిల్లాలకు ప్రధాన కేంద్రంగా హుస్నాబాద్ మారాలని, భవిష్యత్ లో టూరిజం, వ్యవసాయం, పరిశ్రమలు, ఉపాధి, వైద్యం ఇలా అన్నిట్లో రంగాల్లో ఇతర ప్రాంతాల వారు కూడా ఇక్కడికి వచ్చేలా అభివృద్ధి జరగాలని అన్నారు. భవిష్యత్ లో ఏ ఫంక్షన్ హాల్ లో ఫంక్షన్ జరిగిన మున్సిపాలిటీ స్టీల్ బ్యాంక్ నుండి ఇచ్చేలా కార్యాచరణ చేయాలన్నారు. హుస్నాబాద్ లో ఏ ఫంక్షన్ అయినా ఏ హోటల్ లో అయినా ప్లాస్టిక్ వాడకుండా, ఈరోజు నుండే కార్యాచరణ ప్రారంభించుకోవాలని, హుస్నాబాద్ సుందరీకరణ, మౌళిక వసతులు, సమగ్ర డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటుకు నిధులు తీసుకొస్తానన్నారు. హుస్నాబాద్ ప్రధాన రహదారి లో షాప్ లోకి నీళ్లు పోయే పరిస్థితి ఉండే..ఉన్నతాధికారులను తీసుకొచ్చి అలాంటి పరిస్థితి రావద్దని కార్యాచరణ ప్రారంభించామని, నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడాలని సెట్విన్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని దానిని అందరూ ఉపయోగించుకోవాలన్నారు. హుస్నాబాద్ లో 150 పడకల ఆసుపత్రి నీ 250 పడకల ఆసుపత్రి గా మార్చామని, డిగ్రీ కాలేజీలో పీజీ కోర్సులు ఉండేలా ప్లాన్ చేస్తున్నామని, వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడాలని పశు సంపద, మత్స్య సంపద, కుల వృత్తులు ప్రోత్సహించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. ప్రభుత్వం సోషల్ వెల్ఫేర్, గురుకుల స్కూల్ లలో విద్యార్థులకు మెస్ ఛార్జీలు కాస్మొటిక్ చార్జీలు పెంచిందని, ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, బదిలీలు, నియామకాలు చేపట్టిందన్నారు. హుస్నాబాద్ ప్రాంతంలో అన్ని సమస్యలు పరిష్కారం చేయాలనే దిశగా ముందుకు వెళ్తున్నామని, మార్కెట్ కమిటీ చైర్మన్, టెంపుల్ చైర్మన్ లు రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల్లో భాగస్వామ్యం కావాలన్నారు. అధికారులు కూడా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం 20 మంది కౌన్సిలర్ లకి 50 లక్షల చొప్పున పనులు ఇచ్చామని, నియోజవర్గ అభివృద్ది కోసం కలిసి పని చేద్దామన్నారు.

సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ.. హుస్నాబాద్ మున్సిపాలిటీ నీ మోడల్ మున్సిపాలిటీ గా మార్చుకోవాలని, మున్సిపాలిటీ అయిన తరువాత హుస్నాబాద్ లో చాలా అభివృద్ధి జరిగిందని, నాలల నిర్మాణం, రోడ్లు, ఎల్లమ్మ బండ్ అభివృద్ధి బాగా జరుగుతుందన్నారు. హుస్నాబాద్ ను క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచుకోవాలని, ఎక్కడపడితే అక్కడ చెత్త వేయద్ధు ఆ ఆలోచన విధానం మారాలని, మనం మారాలి మనల్ని చూసి మన పిల్లలు మారాలన్నారు. ఈ నూతన భవనంలోనే అన్ని ఉన్నాయని, ఏ సమావేశాలు పెట్టుకోవాలన్న మీటింగ్ హాల్ చాలా బాగుంది దానిని వినియోగించు కోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్మన్ అనిత, కౌన్సిలర్లు, సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, సింగిల్విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, సైదాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *