హైడ్రా బాధితులపై హరీశ్ రావు మొసలి కన్నీరు

హైడ్రా బాధితులపై హరీశ్ రావు మొసలి కన్నీరు

హైడ్రా బాధితులపై హరీశ్ రావు మొసలి కన్నీరు

మల్లన్నసాగర్, కొండపోచమ్మ భూనిర్వాసితుల కన్నీటి బాధలు గుర్తుకు లేవా..?

పదేళ్లు అధికారంలో ఉండి నిర్వాసితులను పట్టించుకోలేదు

భూనిర్వాసితులను భయబ్రాంతులకు గురి చేసి

అర్ధ రాత్రి ఇండ్లు ఖాలీ చేయించి పోలీసులతో లాట్టీ ఛార్జ్ చేయించినప్పుడు

అప్పుడు రాని ఏడుపు ఇప్పుడు ఎందుకొస్తుంది..?

మాజీ మంత్రి హరీష్ రావుపై భూనిర్వాసితుల ఘాటు వాఖ్యలు

సిద్దిపేట టైమ్స్, గజ్వేల్ ప్రతినిధి

మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ భూనిర్వాసితులను భయబ్రాంతులకు గురి చేసి అర్ధ రాత్రి ఇండ్లు ఖాలీ చేయించి పోలీసులతో లాట్టీ ఛార్జ్ చేయించినప్పుడు రాని ఏడుపు ఇప్పుడు ఎందుకొస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాతో అక్రమ నిర్మాణాలు తొలగిస్తే ప్రజలలో  సానుభూతి పొందడానికి   మాజీమంత్రి హరీష్ రావ్ మొసలి కన్నీళ్లు కారుస్తుంటే దయ్యాలు వేదాలు వళ్ళించినట్లుగా ఉన్నదని మల్లన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్ భూ నిర్వాసితులు మాజీ మంత్రి హరీష్ రావుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆదివారం వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. హైదారాబాద్ లోని తెలంగాణా భవన్ లో మాజీ మంత్రి హరీష్ రావ్ మీడియా తో మాట్లాడుతూ మహిళలు చిన్నపిల్లలు అని చూడకుండా పోలీసులతో లాఠీ దెబ్బలు కొట్టినప్పుడు  రాని కన్నీళ్లు, అధికారం కోల్పోయాక సామాన్య ప్రజలు గుర్తుకొచ్చారా..? అని మల్లన్నసాగర్ కొండపోచమ్మ ప్రాజెక్టు భూ నిర్వాసితులు హరీష్ రావు పై ఘాటుగా విమర్శించారు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితులను పోలీసులతో కొట్టించినప్పుడు హుస్సేన్ అనే వ్యక్తి మృతి చెందినప్పుడు, ప్యాకేజీ అందక వేములఘాట్ గ్రామానికి చెందిన తూటుకూరి మల్లారెడ్డి అనే భూనిర్వాసితుడు తన చితిని తానే పేర్చుకుని కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నీకు గుర్తుకు రాలేదా.. ? అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల వల్ల వందలాది మంది రైతులు మరణించినప్పుడు రాని ఏడుపు ఇప్పుడెలా వస్తుందని  నిర్వాసితులు హరీష్ రావును ప్రశ్నించారు. భూ నిర్వాసితుల తరపున తమ హక్కులకోసం కోట్లాడినప్పుడు మమ్మల్ని వెక్కిరించిన హరీష్ రావ్, అర్ధ రాత్రి నిర్వాసితుల ఇండ్లపై బుల్డోజర్ ఎక్కించి వాళ్ళని రేకుల కొట్టంలో ఉంచినప్పుడు ఎడవని హరీష్ రావ్ ఈ రోజు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిర్వాసితులకు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ప్యాకేజీలు, ప్లాట్లు, ఇండ్లు అందలేదని ఇప్పటికైనా వారిని పట్టించుకోవాలని భూ నిర్వాసితులు కోరారు. ప్రభుత్వం వెంటనే హరీష్ రావ్ అక్రమ ఆస్తులపై, ఫాం హౌస్ ల పై ఎంక్వయిరీ చేయాలని డిమాండ్ చేశారు. త్వరలోనే కన్నేపల్లై పంప్ హౌస్ నుండి కొండపొచమ్మ సాగర్ వరకు గల భూ నిర్వాసితులతో పెద్ద ఎత్తున హైదారాబాద్ లోని తెలంగాణా భవన్ నీ ముట్టడిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో భూనిర్వాసితుల బాధితులు హయాతుద్దీన్, శ్రీనివాస్ రెడ్డి , ములుగు మాజీ ఎంపీపీ వెంకట్రామిరెడ్డి, మాజీ సర్పంచ్ కప్పర భాను ప్రకాష్ రావు, ములుగు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముత్యాలు, గజ్వేల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బయ్యారం మల్లారెడ్డి, భూనిర్వాసితులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *