హుస్నాబాద్ “మెగా జాబ్ మేళ” విజయవంతం

హుస్నాబాద్ “మెగా జాబ్ మేళ” విజయవంతం

హుస్నాబాద్ మెగా జాబ్ మేళ విజయవంతం..

నిరుద్యోగ యువత నుండి విశేష స్పందన..

60 కి పైగా కంపెనీలు 5225  మందికి ఉద్యోగాలు

నిరుద్యోగుల కల నెరవేర్చిన మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

హుస్నాబాద్ నియోజకవర్గంలో యువజన సర్వీసుల శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించిన మెగా జాబ్ మేళ కు విశేష స్పందన వచ్చింది. ఈ జాబ్ మేళ కోసం  8795 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాదాపు 60 కి పైగా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు సైతం మెగా జాబ్ మేళా లో పాల్గొన్నాయి. వారికి అవసరమైన విద్యార్హతలు , నైపుణ్యాలు కలిగిన 1,310  మంది నిరుద్యోగులకు తక్షణమే ఆర్డర్ కాపీలు ఇచ్చి ఉద్యోగాలు పొందారు..మరో 3,887 మందిని షార్ట్ లిస్ట్ తయారు చేశారు. వారిని ఆఫిస్ లలో పిలిచి స్కిల్స్ నేర్పించిన తరువాత ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. మొత్తం మీద ప్రత్యక్ష, పరోక్షంగా కలిపి 5,225 మంది నిరుద్యోగులు మెగా జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలు పొందారు. నిరుద్యోగులు ఉద్యోగాలు పొందడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు..

మెగా జాబ్ మేళా లో సున్నా నుండి పీజీ  చదివిన వారు పెద్ద ఎత్తున పాల్గొన్నవారికి మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు..  తక్షణమే ఉద్యోగాలు పొందిన వారికి ఉద్యోగం పొందిన ఆర్డర్ కాపీలను కలెక్టర్ మను చౌదరి తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ అందించారు. జాబ్ మేళ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ ఉద్యోగాలు పొందిన వారే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉపాధి పొందేలా చేపలు, పాల ఉత్పత్తి, ఎనిమల్ హస్బండరి అభివృద్ధి చేసి మరింత ఉపాధి పెంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

హుస్నాబాద్ నియోజకవర్గ  ప్రాంతంలో విద్యను ప్రోత్సహించాలని, ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని ప్రాధాన్యత గా భావిస్తున్నామన్నారు. స్వచ్ఛంద సంస్థలు కూడా మరింత తోడ్పాటును అందించాలనీ కోరారు. ఉద్యోగాల కోసం డిమాండ్ ఎక్కువగా వచ్చిన కంపెనీలు నియోజకవర్గంలోని మండలాల వారీగా జాబ్ మేళా ను నిర్వహించేలా విజ్ఞప్తి చేశారు. నర్సింగ్ ,ఫార్మసీ చదివిన వారికి అపోలో, యశోద, కామినేని హాస్పిటల్ లతో ఇతర హాస్పిటల్ లు, ఫార్మా కంపెనీలు కూడా ఇక్కడ జాబ్ మేళ నిర్వహించేలా కోరుతానని తెలిపారు.

ఇక్కడ జాబ్ మేళా కోసం హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కంపెనీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హుస్నాబాద్ ప్రాంతం నుండి ఎవరు ఉద్యోగాలు కావాలని వచ్చిన వారి పట్ల సానుకూలంగా స్పందించాలని పలు కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. హుస్నాబాద్ లో సెట్వీన్ లో ట్రైనింగ్ ఇచ్చి గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువత శిక్షణ తీసుకొని విదేశాల్లో కూడా ఉద్యోగాలు పొందవచ్చని ఈ ఉచిత శిక్షణ ఉపయోగించుకొని ఉద్యోగాలు పొందాలని నియోజకవర్గ యువతకు సూచనలు చేశారు. నిన్న మాణిక్యపూర్ లో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా ప్రభుత్వ మెడికల్ కాలేజి లో సీటు సాధించిన విద్యార్థులు ఫీజును తానే చెల్లిస్తానని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ ఆకుల రజిత, వైస్ చైర్మన్ అయిలేని అనిత, కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి, ఆర్డీవో శ్రీరామ మూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, మున్సిపల్ కౌన్సిలర్లు, ఇతర అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *