టూరిజం స్పాట్ గా ఉమ్మాపూర్ మహా సముద్రం గండి..
కొండల మధ్య పర్యాటకుల ప్రాంతంగా అభివృద్ధికి ప్రణాళికలు.
చెరువుల్లో వాటర్ నిల్వ ఉంచేలా చర్యలు .
మహా సముద్రం గండి వద్ద గతంలో ఉన్న చెరువులు పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి దాదాపు 7 కిలోమీటర్ల దూరంలో ఉమ్మాపూర్ గ్రామ పరిధిలో గల అత్యంత ఆహ్లాదకరంగా ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఎతైన పర్వత ప్రాంతాలను మరియు గుట్టల మద్య ఉన్న మహాసముద్రాల గండి చెరువును జిల్లా కలెక్టర్ ఎం. మనుచౌదరితో కలిసి రాష్ట్ర రవాణా మరియు బి సి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఎతైన గుట్టలను కలుపుతూ మద్యలో ఉన్న చెరువును చూడడానికి చాలా మంది పర్యటకులు వస్తారని స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకురాగా ఈ ప్రాంతాన్నంతటిని ఓక పెద్ద పర్యటక క్షేత్రంగా చేయడం కోసం టూరిజం శాఖ వారితొ సమావేశం నిర్వహించి ప్రణాళికలు బద్ధంగా డెవలప్ చెద్దాం అని అధికారులకు సూచించారు.

ప్రకృతికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నాచురల్ గా కొండల నుండి వచ్చే జాలూ ద్వారా నిండే చెరువును చూడడానికి వచ్చే పర్యటికులు వచ్చేందుకు రోడ్డు నిర్మాణం, అలాగే చెరువు నుండి నీరు వదిలే తుము మార్గం మరియు చెరువు నిండిన తర్వాత బయటకు నీరు బయటకు వెళ్ళే మత్తడి ప్రాంతాలను పరిశీలించారు. అక్కడి గ్రామస్తులతో బైలంపూర్ చెరువులో నీరు ఉంటే హుస్నాబాద్ లొ భూగర్భ జలాలు పెరిగి నీరు పూల్ లేకపోతే నీళ్ళు అడగంటుతాయని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వానకాలం లో మాత్రమే కనిపించే ఆరిద్ర పూరుగును ఆపూరుపంగా చేతులో పెట్టుకుని చూస్తు మురిసిపోయారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి, ఇతర అధికారులు, మాజీ ఎంపీపీ ఆకుల వెంకన్న, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బంక చందు, స్థానిక నేతలు పాల్గొన్నారు.
