బుక్స్ పేరిట దోపిడీకి తెరలేపిన శ్రీ చైతన్య పాఠశాల..అధిక రేట్లకు పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్న పాఠశాల సిబ్బంది..అధిక రేట్లను చూసి బెంబేలెత్తుతున్నా తల్లిదండ్రులు..

బుక్స్ పేరిట దోపిడీకి తెరలేపిన శ్రీ చైతన్య పాఠశాల..అధిక రేట్లకు పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్న పాఠశాల సిబ్బంది..అధిక రేట్లను చూసి బెంబేలెత్తుతున్నా తల్లిదండ్రులు..

బుక్స్ పేరిట దోపిడీకి తెరలేపిన శ్రీ చైతన్య పాఠశాల..
అధిక రేట్లకు పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్న పాఠశాల సిబ్బంది..
అధిక రేట్లను చూసి బెంబేలెత్తుతున్నా తల్లిదండ్రులు..
అధిక ధరలు, పాఠశాల పేరు ముద్రించడం పై విచారణ చేపట్టిన విద్యాశాఖ అధికారులు..

సిద్దిపేట టైమ్స్ సిద్దిపేట ప్రతినిధి:
సిద్దిపేట లో కార్పొరేట్ స్కూల్స్ బుక్స్ పేరిట పెద విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వేలాది రూపాయలు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. పాఠశాలల దోపిడీని చూసి తల్లిదండ్రులు విద్యార్థులను చదివించాలంటే బెంబేలెత్తుతున్నారు. కొందరు తల్లిదండ్రులు బుక్స్ కొనేందుకు వచ్చి జేబు గుళ్ళ చేసుకొని బిక్క మొహం పెట్టుకొని తిరిగి వెళుతున్నారు. తాజాగా శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం
ఇష్టానుసారంగా అధిక రేట్లతో ప్రింట్ చేసిన పుస్తకాలను విక్రయిస్తున్నారని వెంటనే విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళ నిలయం ఎదురుగా ఒక రూం అద్దెకు తీసుకుని శ్రీ చైతన్య పాఠశాల పేరిట ముద్రించిన పుస్తకాలను స్కూల్ యాజమాన్యం సిబ్బందితో విక్రయిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల పిర్యాదు మేరకు విద్యాశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ సందర్బంగా విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ… అధిక రేట్లతో ప్రింట్ చేసిన పుస్తకాలను విక్రయిస్తున్నారు అని తల్లిదండ్రుల పిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లూ తెలిపారు. పై అధికారుల సూచన మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *