20 ఏండ్ల అవినీతిపై చర్చకు సిద్ధమా..?ఇల్లీగల్ పనులకు సహాకారం ఇవ్వడం లేదనే కమిషనర్ వద్దంటున్నారు..మహిళ అధికారిని పై బిఆర్ఎస్ నాయకుల చర్యలు అనైతికం..త్వరలో మున్సిపల్ కౌన్సిల్ పై అవిశ్వాస తీర్మాణం..సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ కౌన్సిలర్స్..

20 ఏండ్ల అవినీతిపై చర్చకు సిద్ధమా..?ఇల్లీగల్ పనులకు సహాకారం ఇవ్వడం లేదనే కమిషనర్ వద్దంటున్నారు..మహిళ అధికారిని పై బిఆర్ఎస్ నాయకుల చర్యలు అనైతికం..త్వరలో మున్సిపల్ కౌన్సిల్ పై అవిశ్వాస తీర్మాణం..సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ కౌన్సిలర్స్..

20 ఏండ్ల అవినీతిపై చర్చకు సిద్ధమా..?
ఇల్లీగల్ పనులకు సహాకారం ఇవ్వడం లేదనే కమిషనర్ వద్దంటున్నారు..
మహిళ అధికారిని పై బిఆర్ఎస్ నాయకుల చర్యలు అనైతికం..
సిద్దిపేట అభివృద్ధి పై విజిలెన్స్  ద్వారా విచారణ చేపట్టాలి..
త్వరలో మున్సిపల్ కౌన్సిల్ పై అవిశ్వాస తీర్మాణం..
సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ కౌన్సిలర్స్..

సిద్దిపేట టైమ్స్ సిద్దిపేట ప్రతినిధి:
సిద్దిపేట మున్సిపల్ పరిధిలో బిఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు చేస్తున్న అక్రమాలకు సహకారం అందించడం లేదనే మున్సిపల్ కమిషనర్ మహిళ అని చూడకుండా కౌన్సిల్ సమావేశంలో అవమాన పరిచారని కాంగ్రెస్ కౌన్సిలర్లు సాకి ఆనంద్ బాలక్ష్మి, శ్రీదేవి బుచ్చి రెడ్డి, రియాజ్, ఏం ఐ ఏం కౌన్సిలర్ అర్షద్ ఆరోపించారు . గురువారం జిల్లా కేంద్రంలో వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఇటీవల జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మహిళ కమిషనర్ ను బిఆర్ఎస్ నాయకులు కింద కూర్చో పెట్టి అవమాన పరిచారని ఈ విషయమై బుధవారం హైదరాబాద్ నుండి మున్సిపల్ రిజినల్ డైరెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అధికారులు సిద్దిపేట మున్సిపల్ కార్యాలయం విచారణ జరిపారని అన్నారు. విచారణకు ప్రతిపక్ష కౌన్సిలర్లను పిలవకపోవడం ఏంటని ప్రశ్నించారు. బిఆర్ఎస్ కౌన్సిలర్లు చేస్తున్న అక్రమాలకు కమిషనర్ సహకరించడం లేదని కమిషనర్ ని అవమానించారాని ఇక్కడి నుండి కమిషనర్ ను ట్రాన్స్ఫర్ చేయాలని ఆర్ డి కి వినతి పత్రం అందజేశారని తెలిపారు. 20 యేండ్లుగా సిద్దిపేట లో జరుగుతున్నా అవినీతి ఇంత అంత కాదని త్వరలోనే విజిలెన్స్ అధికారుల ద్వారా విచారణ జరిపిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ కు కూడా వినతి పత్రం అందజేశామని తెలిపారు. మంద బలంతో బిఆర్ఎస్ నాయకులు కబ్జాలకు పాల్పడుతూ ప్రభుత్వ భూముల్లో కాంపౌండ్ లు నిర్మించి వాటికి ఇంటి నెంబర్ లు కేటాయించిమని కమిషనర్ కు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. అసలు సిద్దిపేట కు వస్తున్నా నిధులు ఎన్ని ఎన్ని ఖర్చు అవుతున్నాయో విషయాలు ఎవరికీ తెలియదని అవి అడిగితె ఇవ్వడం లేదన్నారు. గతంలో పట్టణం లోని శివారు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి 40 లక్షల రూపాయలు కౌన్సిల్ లో ఆమోదం చేసుకొన్నారని ఎక్కడ కూడా సీసీ కెమెరా లు బిగించలేదని డబ్బులు ఎక్కడికి పోయాయాని ప్రశ్నించారు. 20 యేండ్లుగా వారు ఆడిందే ఆటగా సాగిందని ఇప్పుడు ఆలా సాగనివ్వమని అతి త్వరలో ఇప్పుడున్న కౌన్సిల్ పై అవిశ్వాస తీర్మాణం పెడుతామని తెలిపారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *