ప్రసన్న హరికృష్ణకు మద్దతుగా అభిమానుల విస్తృత ప్రచారం

ప్రసన్న హరికృష్ణకు మద్దతుగా అభిమానుల విస్తృత ప్రచారం

హుస్నాబాద్ పట్టణంలో ప్రసన్న హరికృష్ణకు మద్దతుగా అభిమానుల విస్తృత ప్రచారం

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్,:

కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రసన్న హరికృష్ణను పట్టభద్రులు సంపూర్ణ మద్దతు ప్రకటించి భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన అభిమానులు సూచించారు. ఈ సందర్భంగా విద్యా వ్యాపారాన్ని చేస్తున్న కొందరికి గుణపాఠం చెప్పాలనే లక్ష్యంతో విద్యావేత్త అయిన ప్రసన్న హరికృష్ణ పోటీ చేస్తున్నందుకు తనకు మద్దతు ఇవ్వాలని పెర్కో న్నారు. ఈ ఎన్నికల వార్ వన్ సైడ్ కావాలని పట్టభద్రులు, మేధావులు, ఉద్యోగులు, నిరుద్యోగ యువత హరికృష్ణకు అండగా నిలిచి ఆయన గెలుపుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు. పట్టభద్రుల, నిరుద్యోగుల, ఉద్యోగుల సమస్యల పట్ల ప్రసన్న హరికృష్ణకు పూర్తి అవగాహన ఉందన్నారు.

పట్టభద్రులు ఎదురుకుంటున్న సమస్యల పట్ల కలత చెంది 19 సంవత్సరాల ప్రభుత్వ ఉద్యోగ జీవితానికి రాజీనామా చేసి ఈ ఎన్నికల్లో మన ముందుకు వచ్చిన ప్రసన్న హరికృష్ణకు అండగా నిలువాల్సిన సమయము ఆసన్నమైందన్నారు. ఆయన గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. నిరుద్యోగులకు రూపాయికి ఆన్లైన్ కోచింగ్ ఇస్తూ ఎంతో సేవాందిస్తున్నారన్నారు.

హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ బండ్ మైదానంలో మార్నింగ్ వాకర్స్ ను, స్విమ్మర్స్ ను, పట్టభద్రులను, అంబేద్కర్ చౌరస్తా తదితర ప్రధాన కూడళ్ల వద్ద ప్రసన్న హరికృష్ణకు మద్దతుగా కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమం తాళ్లపల్లి వెంకటేష్, శ్రీధర్, డాక్టర్ శ్రీనివాస్, శ్రీధర్ ముదిరాజ్, సంపత్ విస్తృత ప్రచారం నిర్వహించారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *