సమాజంలో అత్యాచారాలకు, హత్యలకు, అఘాయిత్యాలకు కారణం ఎవరు?

సమాజంలో అత్యాచారాలకు, హత్యలకు, అఘాయిత్యాలకు కారణం ఎవరు?

సమాజంలో అత్యాచారాలకు, హత్యలకు, అఘాయిత్యాలకు కారణం ఎవరు?

మన సమాజం నైతిక, మానవ విలువలు కోల్పోవడం

దేశ సంస్కృతి సాంప్రదాయాలను మరచిపోవడం

టెక్నాలజీని మంచికి కాకుండా తప్పుగా ఉపయోగించడం

ఉమ్మడి కుటుంబాలలో ఉన్నటువంటి విలువలను కోల్పోయి, బంధుత్వాలకు దూరమై, విదేశీ భావజాలానికి దగ్గరవుతున్నాం

ABVP రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సావుల ఆదిత్య

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

సమాజంలో మన చుట్టూ జరుగుతున్న అత్యాచారాలకు, హత్యలకు, అఘాయిత్యాలకు, మోసాలకు కారణం సమాజంలో నైతిక, మానవ విలువలు కోల్పోవడం మరియు మన సంస్కృతి సాంప్రదాయాలను మరచిపోవడమే.

అత్యాచార వార్తలు దినపత్రికలో ఒక భాగంగా మారిపోయాయి, ప్రతిరోజు ఎక్కడో ఒక చోట అత్యాచారం, హత్య జరిగింది అని వాటిని ఖండిస్తూ వారికి న్యాయం జరగాలంటు, అత్యాచారానికి పాల్పడిన వారిని శిక్షించాలి, ఉరితీయాలి, ఎన్కౌంటర్ చేయాలంటు నిరసనలు చేస్తూ సాగుతుంది ఈ లోకం, కానీ ఎన్ని నిరసనలు, కొవ్వొత్తుల ర్యాలీలు చేసిన ఏమి లాభం ఈ దౌర్భాగ్యం అయిన పరిస్థితులు మారనప్పుడు.

మనం రోజు చూస్తున్నాం మద్యానికి బానిసై భార్యను హత్యచేసిన భర్త అని, కన్న తల్లిని చంపిన కసాయి కొడుకు అని, మద్యానికి బానిసై  12 సంవత్సరాల కన్న కూతుర్ని అత్యాచారం చేసి చంపిన తండ్రి అని, 10 మంది మైనర్లు కలిసి 11 సంవత్సరాల చిన్నారిని గ్యాంగ్ రేప్ చేసిన సంఘటనలు మొన్నటికి మొన్న ఉప్పల్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి విద్యార్ధి 2వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం చేసిన ఘటన ఇలా ఎన్నో అమానుషమైన ఘటనలు జరుగుతున్నాయి అసలు వీటికి కారణం ఏంటి?

మత్తుకు, మద్యానికి బానిసగా మారడం మరియు మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోవడం, సమాజంలో నైతిక, మానవ విలువలు కలిపోవడం మరియు టెక్నాలజీని మంచికి కాకుండా తప్పుగా ఉపయోగించడమే ఈ అఘాయిత్యాలకు కారణం.

ఒకవైపు ప్రభుత్వలు ఆదాయం కోసం విచ్చలవిడిగా వైన్స్, బార్లు, బెల్ట్ షాపులకు పర్మిషన్లు ఇస్తు ప్రజలను మత్తుకు మధ్యానికి అలవాటు చేస్తూ బానిసలుగా తయారు చేస్తున్న రాజకీయ నాయకులు, మద్యాన్ని అరికట్టాల్సిన ప్రభుత్వాలే ప్రోత్సహిస్తున్నాయి. మరోవైపు ప్రతి గ్రామానికి చేరుకున్న గంజాయి మత్తు, వైట్నర్, టైర్లకు పంచర్ వేసే బోనోఫిక్స్ కు అలవాటు పడుతూ మత్తువైపు అడుగులు వేస్తున్న పాఠశాల విద్యార్థులు మరియు టెక్నాలజీని (సెల్ ఫోన్లను) మంచికోసం నూతన ఆవిష్కరణలు, తెలియని మంచి విషయాలు, తెలియని దేశ చరిత్ర తెలుసుకోవడం కోసం కాకుండా చెడు ధోరణిలో తప్పుగా వాడుతూ సమయాన్ని వృధా చేస్తూ చెడు ఆలోచనలకు పాల్పడుతున్నారు దీనికి కారణం కొంత వరకు నేటి వంకర బుద్ధితో, తప్పుడు మాటలతో, బంధాలను, బంధుత్వాలను, పెద్దలను గౌరవించకుండా కించపరుస్తూ వస్తున్న సినిమాల ప్రభావం కూడా తోడైంది.


బయట సమాజంలో మత్తు, సినిమాల ప్రభావం, టెక్నాలజీని తప్పుగా వాడటం ఇలాంటివి ఎన్ని ఉన్నా ఇంట్లో మరియు పాఠశాలలో బంధాలు బంధుత్వాల విలువలు, సమాజంలో ఎలా నడుచుకోవాలి, పెద్దలను ఎలా గౌరవించాలి, మహిళలను ఎలా గౌరవించాలి అనే నైతిక విలువలకు, మానవ విలువలకు దూరమై, ఇంట్లో కుటుంబంతో గడపాల్సిన బాల్య సమయం కూడా లక్షల లక్షల ఖర్చుపెట్టి రేపటి మన దేశ భవిష్యత్తును పాఠశాలల్లో ర్యాంకుల కోసం మాత్రమే పోటీపడే చదువులు చెప్పే తరగతి గదులలో బందీ చేస్తున్నారు.
మన దేశంలో ప్రతి మహిళను అమ్మ అని పిలిచే సంస్కారం, ఇక్కడ భూమిని కూడా భూదేవిగా అంటే విశ్వమంతా ఒక మహా స్త్రిశక్తిగా అమ్మగా భావించే సంస్కృతి, ఒక ఆవును గోమాతగా అంటే అమ్మగా పిలిచే సంస్కృతి, ఈ నేలపై పారే నదులను సైతం గంగమ్మ, కృష్ణమ్మ అంటూ మాతృ భావంతో చూసే మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోయి ఉమ్మడి కుటుంబాలలో ఉన్నటువంటి విలువలను కోల్పోయి, బంధుత్వాలకు దూరమై, విదేశీ భావజాలానికి దగ్గరవుతున్నాం ఎందుకంటే నేటి తరంలో మీరు లక్షలు ఖర్చుపెట్టి చదివించే చదువుల్లో విలువల గురించి కానీ ఎవరిని ఎలా గౌరవించాలనేవి లేని కారణంగా ర్యాంకులు మాత్రమే శాశ్వతంగా విద్యార్థులను ఒత్తిడి చేస్తున్న కారణంగా అనేక ఆత్మహత్యలను కూడా మనం చూస్తున్నాం. బ్రిటీషర్లు మనకు అంటించి వెళ్లిన విదేశీ చదువులను అభ్యసిస్తూ, విదేశీ సంస్కృతి సాంప్రదాయం అనుసరిస్తున్న కారణంగా నేడు మన దేశంలో కూడా చిన్న చిన్న పిల్లలు అత్యాచారాలు, మానభంగాలు, హత్యలకు పాల్పడుతున్నారు వీటిని వెంటనే అరికట్టాలంటే ముందుగా ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు మీ పిల్లలపై శ్రద్ధపెట్టి వాళ్ళు చెడు దారిన పడుతున్నారా లేక సరిగ్గానే ఉన్నారా అని చూస్తూ లక్షలు విలువ చేసే ర్యాంకుల చదువులతో పాటు నైతిక మానవ విలువలు, పెద్దలను మహిళలను ఎలా గౌరవించాలో నేర్పిస్తూ, చిన్నారులకు ఏమో ఈ దేశ మహిళా వీరులైన ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి, చాకలి ఐలమ్మ లాంటి వీర నారీల గురించి తెలియజేస్తూ ఎవడైనా మీపై అసభ్యకరంగా ప్రవర్తిస్తే మహాకాళివై పోరాడి వాడిని తరిమి కొట్టమని బోధిస్తూ, సమాజ స్పృహ, దేశ గౌరవం, చరిత్ర అలాగే మన చుట్టూ ఉన్న సమాజానికి మనం సహాయం చేయాలనే ధోరణి నేర్పిస్తూ ప్రతి ఒక్కరిలో వ్యక్తి నిర్మాణం ప్రారంభం కావాలి అప్పుడే భవిష్యత్తులో ఇప్పుడు జరుగుతున్న అఘాయిత్యాలకు, అత్యాచారాలకు హత్యలకు అడ్డుకట్టపడుతుంది అని నా అభిప్రాయం.

Show 1 Comment

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *