బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి హుస్నాబాద్ కి ఏం చేసిందో చెప్పాలి

బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి హుస్నాబాద్ కి ఏం చేసిందో చెప్పాలి

బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి హుస్నాబాద్ కి ఏం చేసిందో చెప్పాలి

బీసీ బిడ్డ మంత్రి అయినాడని ఓర్వలేక మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్

హుస్నాబాద్ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న నాయకుడు మంత్రి పొన్నం ప్రభాకర్

విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పై కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బంక చందు ఫైర్

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

హుస్నాబాద్ లో శనివారం జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ మంత్రి పొన్నం ప్రభాకర్ ను విమర్శించడాన్ని హుస్నాబాద్ మండల కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బంక చందు మాట్లాడుతూ… బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి హుస్నాబాద్ కి ఏం చేసిందో చెప్పాలని, ఒక బీసీ బిడ్డ మంత్రి అయినాడని ఓర్వలేక మాట్లాడే మాటలు తప్ప ఇవి నిజాలు కాదు అని, బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందనే భయంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బంక చందు విమర్శించారు. అనునిత్యం హుస్నాబాద్ అభివృద్దే ధ్యేయంగా పని చేస్తుా అసెంబ్లీలో హుస్నాబాద్ గళం వినిపిస్తున్న నాయకుడు మంత్రి పొన్నం ప్రభాకర్ అని, కాంగ్రెస్ అంటేనే ప్రజా ప్రభుత్వం అని ప్రజా పరిపాలన వైపుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనునిత్యం ప్రజలతో కలుస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న నాయకుడు అని అన్నారు.

గత పది సంవత్సరాలు అధికారం లో వుండి ఫామ్ హౌస్ కే పరిమితమైన నాయకుడు కేసీఆర్ అని, ఈ రోజు ప్రజా ప్రభుత్వం గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందని, హుస్నాబాద్ ప్రాంతం మీద ప్రేమ ఉంది గనుకనే ప్రజలు అక్కున చేర్చుకున్నారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అసలు ఒక సీటు కూడా రాదేమో అని మాజీ ఎమ్మెల్యే కి నిద్ర పట్టడం లేదని కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ది చూసి ఓర్వలేక పోతున్నారని, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హన్మకొండ లో ఉండి కార్యకర్తలను గంటల తరబడి ఎదురు చూసేలా చేసి అవమానించిన చరిత్ర సతీష్ కుమార్ దని, కానీ మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి అయినప్పటికీ హైదరాబాద్ లో ఉన్న సెక్రటేరియట్, మినిస్టర్ క్వార్టర్స్ లో ఎక్కడ ఉన్నా హుస్నాబాద్ వాళ్ళు పోగానే చాయ్ ఇచ్చి సావధానంగా వారి సమస్యలు విని పంపించే సంస్కృతి పొన్నం ప్రభాకర్ దని అన్నారు.

హుస్నాబాద్ నియోజకవర్గానికి మంత్రి పొన్నం ప్రభాకర్ 8 నెలల కాలంలో దాదాపు 900 కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీ స్కీమ్స్ అమలు చేస్తున్నదని మహిళలకు ఉచిత బస్సు , 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కి గ్యాస్, మహిళలకు డ్వాక్రా రుణాలు, రుణమాఫీ, రైతుకు పంట నష్టపరిహారాన్ని పునరుద్ధరణ చేసిందని, 10 సంవత్సరాల కాలంలో చేయలెంది ఈ 9 నెలల కాలంలో చేసి చూపించారని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోనే 34,882 మందికి 280 కోట్ల రైతు రుణమాఫీ పూర్తి చేశామని, నియోజకవర్గంలో ఉద్యోగ ఉపాధి కల్పన కోసం జాబ్ మేళా ద్వారా 5 వేల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించామని అన్నారు.

ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బంక చందు, చిగురుమామిడి మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి, హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిలర్స్ వల్లపు రాజు, కోమటి స్వర్ణలత, బూరుగు కృష్ణస్వామి, బీక్య నాయక్, పోతుగంటి బాలయ్య, గాజుల చంద్రయ్య, పంపర సంపత్, ముప్పిడి రాజ రెడ్డి,  గట్టు రాములు, భూక్య రమేష్ నాయక్, రమేష్, కాంగ్రెస్ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *