ప్రజల సమస్యలు తీర్చడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటాము
గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల జోలికి వెళ్ళవద్దు
సీసీ కెమెరాల ఏర్పాటుకు పోలీస్ డిపార్ట్మెంట్ కు సహకరించాలి
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
హుస్నాబాద్ సిఐ శ్రీనివాస్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతారం గ్రామాన్ని హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ మహేష్ సందర్శించి ఈ సందర్భంగా హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం గ్రామాలను సందర్శించడం జరుగుతుందన్నారు గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆరా తీయడం మరియు గ్రామంలో యువకులు గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల బారిన పడకుండా చూసుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుందని తెలిపారు. యువకులు ఏదైనా మత్తు పదార్థాలు సేవిస్తున్నారని తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని వారిని పిలిచి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ప్రజల రక్షణకు సీసీ కెమెరాలు చాలా ముఖ్యమని సీసీ కెమెరాలు పనిచేయని గ్రామాలలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారస్తులు సీసీ కెమెరాల ఏర్పాటుకు పోలీస్ డిపార్ట్మెంట్ కు సహకరించాలని సూచించారు. ప్రభుత్వం నిషేధించిన గుడుంబా నాటు సారాయి తయారు చేయవద్దని సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని బ్యాంకు అధికారులము రుణమాఫీ అయిందని కేవైసీ అప్డేట్ చేయాలని కారణాలతో సైబర్ నేరగాళ్లు ఫోన్ చేస్తారు, ఎవ్వరు కూడా బ్యాంకు వివరాలు మీ పర్సనల్ డాటా ను షేర్ చేయవద్దని సూచించారు. రుణమాఫీ విషయంలో ఏదైనా సమస్య ఉంటే నేరుగా బ్యాంకు వెళ్లి బ్యాంకు అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.
ఆన్లైన్ మోసాల బారిన ఎవరు కూడా పడవద్దు అని తెలిపారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే వెంటనే 1930 సైబర్ సెల్ జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. గ్రామాలలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగితే వెంటనే డయల్ 100 కు కాల్ చేసి తెలుపాలని సూచించారు. ప్రజల సమస్యలు తీర్చడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవల అందిస్తామని తెలిపారు. ప్రజల ధన మాన ప్రాణ రక్షణకు డిపార్ట్మెంట్ ఎప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.