వెల్పుల బాల మల్లు మరణం సిపిఐకి అత్యంత తీరనిలోటు

వెల్పుల బాల మల్లు మరణం సిపిఐకి అత్యంత తీరనిలోటు

వెల్పుల బాల మల్లు మరణం సిపిఐకి అత్యంత తీరనిలోటు


బాల మల్లు మరణంతో గోల్లు మన్న సముద్రాల.

ఆట పాటలతో భారీగా  సాగీన బాల మల్లు
అంతిమ యాత్ర.

బాల మల్లు కుటుంబానికి సిపిఐ ఎప్పుడూ అండగా వుంటుంది.

గడిపె మల్లేశ్ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు.

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

నిరంతరం నిరుపేద కోసం పరితపిస్తూ భారత కమ్యునిస్టుపార్టీ సిపిఐ అనుబంధ సంఘం అఖిల భారత యువజన సమాఖ్యలో కరీంనగర్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా పనిచేస్తు అనాటి ఇందూర్తి ఎమ్మెల్యే దేశిని చిన్న మల్లయ్య, అప్పటి సిపిఐ జిల్లా కార్యదర్శి జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి నాయకత్వనా సాగిన సిపిఐ నిర్వహించిన ప్రజా పోరాటాల్లో చురుకైన నాయకుడిగా కొహెడ మండల సిపిఐ కార్యదర్శిగా జిల్లా కార్యవర్గ సభ్యులుగా, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడిగా, దళిత హక్కుల పోరాట సమితి సిద్దిపెట జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన వెల్పుల బాల మల్లు గత ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి సహకారంతొ గత మే నెల 28న హైదరాబాద్
లోని పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో చెరి చాడ వెంకటరెడ్డి కృషి వల్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏనుముల రేవంత్ రెడ్డి ద్వారా 2లక్షల 80 వేలు ఆర్థిక సహాయం చేసారని నిమ్స్ ఆసుపత్రిలో గత పది రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం నాడు తుదిశ్వాస విడిచారని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు హుస్నాబాద్ మాజీ వైస్ ఎంపిపి గడిపె మల్లేశ్ అన్నారు.


వెల్పుల బాలమల్లు స్వర్గమైనా సముద్రాలలోని  నివాసంలో ఆయన భౌతికకాయాన్ని సందర్శించిన గడిపె మల్లేశ్ సిపిఐ జిల్లా నాయకులతో కలిసి ఎర్రజెండా కప్పి
పుల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం గడిపె మల్లేశ్ మాట్లాడుతూ వెల్పుల బాల మల్లు సిపిఐ నిర్వహించిన ప్రజా పోరాటాలకు ప్రజా సైనికుడిలా పని చేసాడని నిరంతరం పేద ప్రజల హక్కుల పరిరక్షణ కోసం సిపిఐ జాతీయ నేత
చాడ వెంకటరెడ్డి నాయకత్వంలో మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గలో తాగు సాగు నీరు కోసం 2003లొ గౌరవెల్లి, గండిపెల్లి, తోటిపెల్లి ప్రాజెక్టుల
సాధన కోసం సాగిన పాదయాత్రలో ఇందూర్తి నియోజకవర్గంలో తిరిగి తాగు సాగు నీరు కోసం ప్రజలను చైతన్య వంతులను చేసారని 2013లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని భారత కమ్యునిస్టుపార్టీ(సిపిఐ) పిలుపు మేరకు చాడ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రలో పాల్గొని తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని బాల మల్లు సేవలను గడిపె మల్లేశ్ గుర్తు చేశారు.
పేద రాజ్యం స్థాపన కోసం పనిచేసి ప్రజల గుండేల్లో చెరగని ముద్ర వేసుకున్న బాల మల్లు చేసిన పోరాటాలు ప్రజలు మరిచి పోలేరని గడిపె మల్లేశ్ అన్నారు.
బాల మల్లు ఆశించిన పేదల రాజ్యం స్థాపన కోసం నేటి యువతరం సిపిఐ నిర్వహించే ప్రజా పోరాటాల్లో భాగస్వామ్యులై అన్యాయం దోపిడిని అక్రమాలను ఎక్కడికక్కడే ఎండగట్టాలని అప్పుడే బాల మల్లుకు అసలైన ఘన నివాళి అన్నారు.


ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు బోయిని అశోక్, నియోజకవర్గ నాయకులు అందే స్వామి,కోయడ సృజన్ కుమార్, బత్తుల బాబు,సిపిఐజిల్లా కార్యవర్గ సభ్యులు పొతిరెడ్డి వెంకటరెడ్డి,యెడల వనేష్, జాగీర్ సత్యనారాయణ,కనుకుట్ల శంకర్,కిష్టపురం లక్ష్మణ్,భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర నాయకురాల్లు గూడేం లక్ష్మి,కిన్నేర మల్లవ్వ, గూడ పద్మ, పిల్లి రజిని, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అయిలేని సంజీవరెడ్డి,కోయడ కోమురయ్య, బొనగరి రూపేష్, వెల్పుల శ్రీనివాస్,బోనగిరి శంకర్, కోహెడ, అక్కన్నపేట మండలాల సిపిఐ మండల కార్యదర్శులు ముంజ గోపి, కొమ్ములభాస్కర్, ఎఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జనగాం రాజు కుమార్, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు రామగాళ్ళ నరేష్,ఎఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జెరిపొతుల జనార్ధన్,భవన నిర్మాణ సంఘం జిల్లా అధ్యక్షుడు బెక్కంటి సంపత్, సిపిఐ సినియర్ నాయకులు తాళ్ళపెల్లి ఎల్లయ్య,గంగి రాజు, జన్నవేని కనకయ్య, శనిగరం పోచయ్య, కాల్వల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. బాల మల్లు అంతిమ యాత్రలో గడిపె మల్లేశ్ బృందం పాడిన పాటలు పలువురిని కంటతడి పెట్టించాయి.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *