సింగరేణి ఉద్యోగాల్లో జిల్లా మార్పుతో నిరుద్యోగులకు అన్యాయం

సింగరేణి ఉద్యోగాల్లో జిల్లా మార్పుతో నిరుద్యోగులకు అన్యాయం

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నోటిఫికేషన్లో ఉమ్మడి జిల్లా నిరుద్యోలకు న్యాయం చేయాలి

కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని నాలుగు మండలాల నిరుద్యోగులు జిల్లా మార్పుతో స్థానికత కోల్పోయారు

గతంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కి స్థానికత సమస్యను విన్నవించిన నిరుద్యోగులు

మంత్రి  చొరవ తీసుకొని నిరుద్యోగుల స్థానికత సమస్యను పరిష్కరించాలి

బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల శంకర్ బాబు

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల శంకర్ బాబు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మాజీ మంత్రి హారీష్ రావు, మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు అనాలోచిత విధానాల వల్ల జిల్లాల పునర్విభజనలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్, కోహేడ, అక్కన్నపేట, బెజ్జంకి నాలుగు మండలాలు సిద్ధిపేట జిల్లాలో చేర్చడంతో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ 327 పోస్టులకు నోటిఫికేషన్ 1 మార్చి నెలలో వేయగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వారు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ లో ఉమ్మడి జిల్లాలోని నాలుగు మండలాల నిరుద్యోగులు (లోకల్ )స్థానికతను కోల్పోయారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఇచ్చిన నోటిఫికేషన్ లో (లోకల్)స్థానికంగా ఉన్న జిల్లాలకు మాత్రమే 95 శాతం (లోకల్)స్థానికతను వర్తింపజేసి ఉద్యోగం కల్పిస్తారు. ఇదే విషయాన్ని నోటిఫికేషన్ విడుదలైనా 15 రోజులకే నాలుగు మండలాల నిరుద్యోగులు కలిసి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి విన్నవించగా, డిప్యూటీ సీఎం బట్టి విక్రమకి తెలియజేసినట్లు పలు వార్త పత్రికల్లో వార్తలు వచ్చాయి. కానీ ఈనెలలో జరిగిన పరీక్షలో హాల్ టికెట్ పై నాన్ లోకల్ గా స్టేటస్ చూపించగా, నాలుగు మండలాల నిరుద్యోగులు కంగు తిని, నిరాశాకు గురియ్యారు. ఈ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ నాలుగు మండలాల నిరుద్యోగుల పట్ల అలసత్వం, నిర్లక్ష్యం వహించినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. నాలుగు మండలాల నిరుద్యోగులకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో ఉద్యోగం చేయాలనే కళా కళగానే మిగిలిపోయేలా ఉంది అని అన్నారు. ఎన్నికల సమయంలో పొన్నం ప్రభాకర్ రాష్ట్రంలో హుస్నాబాద్ ప్రాంతాన్ని ఒక్క బ్రాండ్ గా ఉంచుతానని మాట ఇచ్చారు. కానీ ఉమ్మడి జిల్లాలోని మూడు మండలాల నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. ఇప్పటికైనా మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయంలో చిత్తశుద్ధి చాటి, నోటిఫికేషన్ రిజల్ట్స్ వచ్చేలోపు అయినా నాలుగు మండలాల నిరుద్యోగులకు స్థానికతను వర్తింపజేయాలని, ఇటీవల రిలీజ్ చేసిన రెండో నోటిఫికేషన్లో అయినా నాలుగు మండలాల నిరుద్యోగులకు లోకల్ స్థానికతను వర్తింపజేసే విధంగా పొన్నం ప్రభాకర్  కృషి చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో నాలుగు మండలాల నిరుద్యోగులను ఐక్యం చేసి, వారి పక్షాన పోరాడుతామని హెచ్చరించారు.

ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ హుస్నాబాద్ పట్టణ ఉపాధ్యక్షులు గాదాసు రాంప్రసాద్, బీజేవైయం పట్టణ అధ్యక్షుడు పోలోజు రాజేందర్, బీజేపీ సీనియర్ నాయకులు అశాడపు శ్రీనివాస్ పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *