గొంగడికి యునెస్కో గుర్తింపు..
కురుమల జీవనంలో భాగమైన ‘చేనేత వస్త్రం’
నలుపు, తెలుపు గొర్రెల ఉన్నితో నేత..
సిద్దిపేట టైమ్స్ దౌల్తాబాద్:
నలుపు, తెలుపు గొర్రెల ఉన్నితో నేసే గొంగళ్లు తెలుగు రాష్ట్రాల్లోని కురుమల సామాజికవ ర్గం వారసత్వ సంప్రదాయంగా ఉంది. ఇళ్లలో చలికాలం వెచ్చగా, ఎండాకాలం చల్లగా, అడవుల్లో జీవాలు మేసే సమయాన వర్షాకాలం తడవకుండా ఉండేందుకు పురుడు పోసుకున్న ఈ గొంగడి వారి జీవితంలో అంతర్భాగంగా మారింది. ఈ ప్రాంతంలో లభించే దక్కన్ జాతి గొర్రెల నుంచి మాత్రమే నలుపు, తెలుపు ఉన్ని లభ్యమవుతుంది. మహిళలు ఈ ఉన్నిని సంప్రదాయ పరికరాలు, ఏకుబద్ద, కదురు సాయంతో వడికి దారంగా మలిచి ఉండలుగా చుడతారు. పురుషులు గొంగళ్లు మగ్గంపై నేస్తారు. ప్రతి గొంగడికీ ప్రత్యేక అంచు ఉంటుంది. మారుతున్న కాలానుగుణంగా కొత్తగా ఎన్నో వాణిజ్యావసరాలు పుట్టుకు రావడంతో కురుమలు వీటిని ఇప్పుడు పట్టణ వినియో గదారుల కోసం నేస్తున్నారు. యోగా మ్యాట్స్న,తలకు చుట్టుకున్న మఫ్లర్ (తలగుడ్డ) మాదిరిగా తయారు చేస్తు న్నారు. ‘అయితే ఇప్పుడు సంప్రదాయ గొర్రెల పెంపకం తగ్గి, మాంసం ఎక్కువ ఇచ్చే జాతులను పెంచుతుండటం వల్ల ఉన్ని ఉత్పత్తి తగ్గిపోయింది’ అని యునెస్కో విశ్లేషిం చింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 47 విశిష్ట చేనేత సంప్రదాయ వస్త్రాలు ఉన్నట్లు యునెస్కో వెల్లడించింది. ’21వ శతాబ్దం కోసం తయారుచేసిన చేనేత వస్త్రాలు,సం ప్రదాయ భారతీయ వస్త్రాల సంరక్షణ’ పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలో తెలుగు రాష్ట్రాల నుంచి మూడింటికి చోటు దక్కింది. వాటిలో కురుమల గొంగడి ఒకటి.