తృటిలో తప్పిన ప్రమాదం.. ఒకే రన్వేపై రెండు విమానాలు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
ముంబై విమానాశ్రయంలో శనివారం నాడు ఓ ఘోరప్రమాదం తప్పింది.
ఇండోర్ నుంచి వచ్చిన ఇండిగో విమానం ల్యాండ్ అవుతుండగా, అదే రన్వేపై ఎయిర్ ఇండియా విమానం తిరువనంతపురం వెళ్లేందుకు టేకాఫ్ అయ్యింది.
రెండు విమానాల మధ్య కొన్ని వందల మీటర్ల దూరమే ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందిని విధుల నుంచి తప్పించారు.
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారింది.