గద్దర్, జయశంకర్, జహీరుద్దీన్లకు ఘన నివాళి

గద్దర్, జయశంకర్, జహీరుద్దీన్లకు ఘన నివాళి

ప్రజా అమరులు గద్దర్, జయశంకర్, జహీరుద్దీన్లకు ఘన నివాళి

గద్దర్ ప్రథమ వర్ధంతి, ఫ్రొఫెసర్ జయశంకర్ జయంతి, ప్రజా ఉద్యమకారుడు జహురూద్ధిన్ అలీఖాన్ వర్ధంతి

ముఖ్య అతిథులుగా మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే చాడా వెంకట్ రెడ్డి

సిద్దిపేట టైమ్స్, హుస్నాబాద్:

హుస్నాబాద్ పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద ప్రజా అమరుల జయంతి, వర్ధంతుల కార్య క్రమం మంగళవారం నిర్వహించారు. ప్రజా గాయకుడు గద్దర్ ప్రథమ వర్గంతి, ఫ్రొఫెసర్ జయశంకర్ జయంతి, ప్రజా ఉద్యమకారుడు జహురూద్దీన్ అలీఖాన్ వర్ధంతుల సందర్భంగా జరిగిన ఈ నివాళి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి, కాంగ్రెస్ నాయకులు వెలిచాల రాజేందర్ రావు హాజరయ్యారు.ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద అమరవీరుల స్థూపానికి సీపీఐ జాతీయ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తో కలిసి నివాళులు అర్పించిన అనంతరం అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ స్థూపం నిర్మాణానికి 34 ఏళ్ల క్రితం కీలకపాత్ర పోషించిన గద్దర్ అన్న వర్ధంతి ఇక్కడ జరుపుకుంటున్నామని వక్తలు గుర్తుచేశారు. ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటం జరిగితే.. మలిదశ తెలంగాణ ఉద్యమం లో నీళ్ళు, నిధులు, నియామకాల కోసం పోరు జరిగిందన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత పదేళ్లు రాజ్యమేలిన నియంతృత్వాన్ని పారదోలితే ప్రజాపాలన వచ్చిందని గుర్తుచేశారు.

మంత్రి పొన్నం మాట్లాడుతూ… స్వయంగా ముఖ్యమంత్రి గద్దర్ సంస్మరణ సభ లో పాల్గొని జయంతి, వర్థంతి వేకలు ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారని చెప్పారు. 2007 లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గౌరవెల్లి ప్రాజెక్ట్ ప్రారంభించారని, దాన్ని పూర్తి చేసే అవకాశం తనకు లభించిందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్క ప్రాజెక్ట్ కోసం భారీ నిధులు ఇచ్చిన ప్రాజెక్ట్ గౌరవెల్లి మాత్రమేనని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి కాలువలు నిర్మించి పంట పొలాలకు నీళ్ళు అందిస్తామని చెప్పారు.

ఆనాడు గన్ పట్టి భూమి కోసం, భూక్తి కోసం, విముక్తి కోసం పోరాటం జరిగితే ఈ రోజు ప్రజాస్వామికంగా ఓటు ఆయుధంగా భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయి అన్నారు.

ఎవరి అభిప్రాయాన్ని అయినా స్వేచ్చగా వినిపించవచ్చు.
ప్రజా భవనాన్ని జ్యోతి బాపులే పేరు మీద మంత్రుల కార్యాలయాలు ప్రజలకు విజ్ఞాప్తులుగా చేసుకునే వేదికలుగా మారాయి. కేంద్రం చట్టాలు మార్చిందని భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉందని బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  ప్రభుత్వాలు మాత్రం ప్రజలకు అందుబాటులో ఉంటేనే మనుగడ కొనసాగిస్తాయి లేకపోతే వాటికి కూడా ఇబ్బందులు తప్పవన్నారు

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, జేఏసీ నాయకులు కవ్వల లక్ష్మారెడ్డి, మేకల వీరన్న యాదవ్, టీపీసీసీ మెంబర్ చేయడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కౌన్సిలర్లు చిత్తారి పద్మ, భూక్య సరోజన, వల్లపు రాజు, కాంగ్రెస్ నాయకులు కర్ణ కంటి మంజులారెడ్డి, బంక చందు, అక్కు శ్రీనివాస్, గడిపే మల్లేష్, కోయడ కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *