సిద్దిపేట జిల్లాలో పలువురు తహశీల్దార్ల బదిలీ..
సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేట, సెప్టెంబరు 28:
సిద్దిపేట జిల్లాలో పలువురు తహశీల్దార్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ హైమావతి ఉత్తర్వులు జారీ చేశారు.
నంగునూరు తహశీల్దారు సరితను మర్కూక్ మండలానికి బదిలి చేశారు. ప్రవీణ్ రెడ్డిని దూళ్మిట్టకు కేటాయించారు. భూంపల్లి తహశీల్దార్ మల్లికార్జున్ రెడ్డిని కొండపాకకు, శ్యాంను భూంపల్లికి మార్చారు. ధూళ్మిట్ట తహశీల్దార్ మధును అక్కన్నపేటకు, అక్కన్నపేట తహశీల్దార్ అనంతరెడ్డిని కలెక్టరేట్ కు బదిలీ చేశారు. సిద్ధిపేట రూరల్ డిప్యూటీ తహశీల్దార్ రాజేశంకు రాయపోల్, డిప్యూటీ తహశీల్దార్ రఘువీర్ రెడ్డికి వర్గల్, డిప్యూటీ తహశీల్దార్ మాధవికి నంగునూరు పూర్తి భాద్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.




