గణేష్ మండపం పెట్టాలంటే ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే…..!

గణేష్ మండపం పెట్టాలంటే ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే…..!

గణేష్ మండపం పెట్టాలంటే ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే…..!

హుస్నాబాద్ ఏసిపి వాసాల సతీష్

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ : సెప్టెంబర్ 7 నుంచి వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. గణేష్‌ మండపాల ఏర్పాటు, ఉత్సవాల నిర్వహణకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. పలు నిబంధనలను పేర్కొంటూ ప్రకటన విడుదల చేశారు.

హుస్నాబాద్ డివిజన్లో వినాయకుడి మండపాలు ఏర్పాటు చేసేందుకు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వాసాల సతీష్ సూచించారు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు https://www.tspolice.gov.in సైట్లో అప్లె చేసుకోవాలని సూచించారు. 2 బాక్స్ టైప్ లౌడ్ స్పీకర్లను మాత్రమే వాడాలని, రాత్రి 10 గం.నుంచి ఉ.6 వరకు వాటిని వినియోగించవద్దని తెలిపారు. పూర్తి వివరాల కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ/ ఎస్ఐ ను సంప్రదించాలని అన్నారు. ప్రశాంతమైన శాంతియుత వాతావరణంలో భిన్నత్వంలో ఏకత్వం లాగా పండుగ జరుపుకోవాలని సూచించారు.

గణేశుడిని/ వినాయకుని  నిలబెట్టేవారు పాటించాల్సిన నిబంధనలు


1. పోలీస్ పర్మిషన్ తప్పనిసరి.
2. కరెంట్ కనెక్షన్ కోసం DD అవసరం. విద్యుత్ అధికారుల పర్మిషన్ తప్పనిసరి.
3. మండపాలతో రోడ్డు మొత్తం బ్లాక్ చేయొద్దు, కనీసం టూ వీలర్ వెళ్లేందుకైనా దారి ఇవ్వాలి.
4. DJలకు అనుమతి లేదు.
5. రాత్రి 10 దాటిన తర్వాత మైక్లు ఆఫ్ చేయాలి.
6. సీసీ కెమెరాలు బిగించుకోవడం మేలు.
7. ఫైర్ సేఫ్టీ కూడా తప్పక పాటించాలని,
8. పాయింట్ బుక్ కూడా ఏర్పాటు చేసుకోవాలి.
9. ఎలాంటి విద్యుత్  షాక్ తగలకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి.
10. వర్షాన్ని దృష్టిలో ఉంచుకొని మండపాలు ఏర్పాటు తీసుకోవాలని సూచించారు.


 

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *