కోహెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని తంగేళ్లపల్లి గ్రామ శివారులో ఏఎస్ఆర్ బిక్స్ కంపెనీ సమీపంలో అక్రమంగా డంపు చేసిన ఇసుక పట్టుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్ & కోహెడ పోలీసులు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
తంగళ్ళపల్లి గ్రామ శివారు ఏఎస్ఆర్ బిక్స్ కంపెనీ సమీపంలో తిప్పారపు నవీన్ చారి, తండ్రి వెంకట్ నర్సయ్య కూరెళ్ళ గ్రామం, కోహెడ మండలం, అనే వ్యక్తి ఎలాంటి ప్రభుత్వ అనుమతి, ఎలాంటి వే బిల్లులు లేకుండా దాదాపు 150 టన్నుల ఇసుకను అక్రమంగా డంపు చేసినడని నమ్మదగిన సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, కోహెడ పోలీసులు వెళ్లి పట్టుకున్నారు. కోహెడ పోలీసులు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు.
ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక, పిడిఎస్ రైస్, మొరము, మట్టి అక్రమ రవాణా చేసిన మరియు పేకాట, జూదం, గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయించిన కలిగి ఉన్న చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటు సమాచారం ఉంటే వెంటనే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ 8712667445 ఆఫీసర్స్ 8712667447, 8712667446, నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.