అక్రమంగా డంపు చేసిన ఇసుక పట్టుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్ మరియు హుస్నాబాద్ పోలీసులు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పందిళ్ళ గ్రామ శివారులో అక్రమంగా డంపు చేసిన ఇసుక పట్టుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్ & హుస్నాబాద్ పోలీసులు…
బుధవారం రాత్రి సమయంలో హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పందిళ్ళ గ్రామ శివారులో షణ్ముఖ రైస్ మిల్ వద్ద ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఎలాంటి వే బిల్లులు లేకుండా దాదాపు 40 టన్నుల ఇసుకను అక్రమంగా డంపు చేశారని నమ్మదగిన సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, హుస్నాబాద్ పోలీసులు వెళ్లి పట్టుకున్నారు. హుస్నాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు.
ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ.. ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక, పిడిఎస్ రైస్, మొరము, మట్టి అక్రమ రవాణా చేసిన మరియు పేకాట, జూదం, గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయించిన కలిగి ఉన్న చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటు సమాచారం ఉంటే వెంటనే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ 8712667445 ఆఫీసర్స్ 8712667447, 8712667446, నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.