అక్రమంగా డంపు చేసిన ఇసుక పట్టుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్ & అక్కన్నపేట పోలీసులు
సిద్దిపేట టైమ్స్ డెస్క్:
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లంపల్లి గ్రామ శివారులో రంగారెడ్డి, స్థలంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా దాదాపు 40 టన్నుల ఇసుకను అక్రమంగా డంపు చేశారని నమ్మదగిన సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, అక్కన్నపేట పోలీసులు వెళ్లి పట్టుకున్నారు. అక్కన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు.
ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ… ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక, పిడిఎస్ రైస్, మొరము, మట్టి అక్రమ రవాణా చేసిన మరియు పేకాట, జూదం, గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయించిన కలిగి ఉన్న చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్టు సమాచారం ఉంటే వెంటనే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ 8712667445 ఆఫీసర్స్ 8712667447, 8712667446, నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.