వ్యర్థాలను స్వయంగా తొలగించిన మంత్రి

వ్యర్థాలను స్వయంగా తొలగించిన మంత్రి

హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద “స్వచ్చత హి సేవ” కార్యక్రమం

గణేష్ నిమజ్జనం తరువాత ఉన్న వ్యర్థాలను స్వయంగా తొలగించిన మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్ ఎల్లమ్మ చెరువు వద్ద జరిగిన “స్వచ్చత హి సేవ” కార్యక్రమంలో పాల్గొని ఎల్లమ్మ చెరువు వద్ద గణేష్ నిమజ్జనం తరువాత ఉన్న వ్యర్థాలను స్వయంగా తొలగించారు. చెరువులో ఉన్న వ్యర్థాలను పారలతో ఎత్తి ట్రాక్టర్ లో పోశారు.

ఈ సందర్భంగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ…రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ నవరాత్రి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా ఘనంగా జరుపుకున్నారని, నవరాత్రుల తరువాత ఊరేగింపులుగా నిమజ్జనం జరిగింది అయితే నిమజ్జనం తో కార్యక్రమం ముగియలేదని నిమజ్జనం తరువాత మనం ఏ చెరువులో అయితే గణేష్ లను వేసినమో వ్యర్థాలను తొలగించిన తరువాతనే గణేష్ ఉత్సవాలకు పరిపూర్ణత వస్తదన్నారు. తెలంగాణ వ్యాప్తంగా గణేష్ నిర్వాహకులు గణేష్ ఉత్సవాలలో క్రియశిలకంగా పాల్గొన్నవారు స్వచ్చ భారత్, స్వచ్చ తెలంగాణ లో మీ వాడ, మీ ఊర్లు బాగుండే విధంగా మీరే స్వయంగా పూనుకొని జలాశయాల్లో గణేష్ నిమజ్జనం అయినా దగ్గర వ్యర్థాలను తొలగించడం, సీజనల్ వ్యాధులు రాకుండా ఉండడానికి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అందరూ స్వచ్చత హి సేవ లో పాల్గొనాలని గాంధీజీ ఇచ్చిన సూత్రాలను పాటించాలన్నారు. హుస్నాబాద్ ను స్వచ్చ హుస్నాబాద్ గా మార్చుకోవడానికి మున్సిపల్ సిబ్బంది పని చేస్తున్నారు. శానిటేషన్ సిబ్బందికి గతంలో అక్టోబర్ 2 న సన్మానం చేసుకున్నాం..ఇలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టుకోవాలని, ప్రతి ఒక్కరు స్వచ్చత లో భాగస్వామ్యులు కావాలన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్మన్ అనిత, మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్, ఎమ్మార్వో ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *