మెదక్ బంద్ ప్రశాంతం..పోలీస్ దిగ్బంధనంలో మెదక్..ఐజి రంగనాథ్ పర్యవేక్షణలో మెదక్ లో భారీ బందోబస్తు..

మెదక్ బంద్ ప్రశాంతం..పోలీస్ దిగ్బంధనంలో మెదక్..ఐజి రంగనాథ్ పర్యవేక్షణలో మెదక్ లో భారీ బందోబస్తు..

మెదక్ బంద్ ప్రశాంతం..
పోలీస్ దిగ్బంధనంలో మెదక్..
ఐజి రంగనాథ్ పర్యవేక్షణలో మెదక్ లో భారీ బందోబస్తు..
కొనసాగుతున్న పోలీస్ పికెట్..
మెదక్ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అరా..!
మెదక్ పోలీస్ ల వైపల్యంపై.. డిజిపి తో మాట్లాడిన బండి..!
9 మంది అరెస్టు.. అల్లర్లకు పాల్పడిన 45 మంది గుర్తింపు..
మీడియా సమావేశం లో ఐజీ రంగనాథ్..

సిద్దిపేట టైమ్స్: మెదక్ ప్రత్యేక ప్రతినిధి:

జిల్లా కేంద్రమైన మెదక్ లో శనివారం రాత్రి, ఇరువర్గాలు రాళ్ళు.. కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్న ఘటనలో 9 మందిని పోలీస్ లు అరెస్టు చేశారు. పోలీస్ ల వైపల్యానికి నిరసనగా బీజేపీ, బీజేవైఎం ఆర్ఎస్ఎస్ హిందూ సంఘాలు ఆదివారం మెదక్ బంధుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. వ్యాపార వాణిజ్య వర్గాలు మూసివుంచారు. ఐజీ రంగనాథ్ పర్యవేక్షణలో మెదక్ లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ బాలస్వామి, ఎఎస్పీ మహేందర్, డిఎస్పీ రాజేష్ ల ఆధ్వర్యంలో మెదక్ లో పోలీస్ పీకెట్ ఏర్పాటు చేశారు. అన్ని ప్రధాన చౌరస్తాలలో పోలీస్ బందో బస్తు ఏర్పాటు చేశారు. దేవాలయాలు, మసీదుల వద్ద పోలీస్ పీకేట ఏర్పాటు చేసి పట్టణంలో పోలీసుల పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. శాంతి భద్రతలు పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఐజీ రంగనాథ్ మెదక్ లోనే మకాం వేసి శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్నారు.

అల్లర్లకు పాల్పడిన 45 మందిని గుర్తించాం..
నిందితులు.. ఏ పార్టీ వారై న వదిలే ప్రసక్తే లేదన్నారు. ఐజీ రంగనాథ్…

ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఐజీ రంగనాథ్ మీడియా సమావేశం లో మాట్లాడారు. అల్లర్లకు పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. ఇరు వర్గాల కు సంబంధించి 45 మందిని గుర్తించాం అని ఐజీ తెలిపారు. పోలీస్ ల వై పల్యం ఉంటే వారి పై కూడా చర్యలు ఉంటాయని ఐజి ప్రకటించారు.

మెదక్ ఘటనపై.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి.. అరా!

మెదక్ లో శనివారం రాత్రి ఇరువర్గాలు ఘర్షణ పై పార్టీ వర్గాల ద్వారా ఆరాతీశారు. అనంతరం డీఐజీ తో బండి సంజయ్ మాట్లాడినట్లు తెలుస్తోంది. మెదక్ ఘటనపై నిష్పక్షపాతంగా పోలీస్ లు వ్యవహరించాలని డిఐజీ తో మాట్లాడినట్టు తెలుస్తుంది. మెదక్ లో ఆదివారం బంద్ సంపూర్ణంగా జరిగింది.

9 మంది అరెస్టు..

మెదక్ అల్లర్ల ఘటనలో 9 మందిని పోలీస్ లు ఆదివారం అరెస్టు చేశారు.మెదక్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ తో పాటు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాయిని ప్రసాద్,మరో 7 గురు మొత్తం 9 మందిని పోలీస్ లు అరెస్టు చేశారు. మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరు పరచగా జడ్జి 9 మందికి 14 రోజుల రిమాండ్ విధించింది. వారిని జిల్లా జైలుకు తరలించారు.
ఇదిలా ఉండగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ తో పాటు 9 మందిని శనివారం రాత్రి పోలీస్ లు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి ఆదివారం ఉదయం కోర్టులో హాజరు పరిచారు. ఇదిలా ఉండగా పోలీస్ లు ఏ కపక్షంగా వ్యవహరించి కేవలం ఒక వర్గానికి కి చెందిన నాయకులనే అరెస్టు చేస్తున్నారని భజరంగ్ దళ్ పట్టణ అధ్యక్షులు అప్పల సురేష్, హిందూ సంఘాలు సోమవారం బంద్ కు పిలుపు నిచ్చారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *