కోహెడ మండల కేంద్రంలో భారీ వర్షాలతో ప్రభావితమైన ప్రాంతాలను బుధవారం జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ అనురాధలు పరిశీలించారు.
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:




బదుగుల చెరువు పూర్తిగా నిండి ఓవర్ ఫ్లో అయి వస్తున్న వాటర్ నాలా ద్వారా ప్రవహిస్తూ కోహెడ గ్రామంలోని కొన్ని ప్రాంతాలలో ఇండ్లలోకి ప్రవహించడంతో ఇండ్లు దెబ్బతిన్నాయి. డ్రైనేజ్ కూడా దెబ్బతిని ఇండ్లలోకి నీరు వచ్చింది. ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించి బాధితులతో మాట్లాడి భరోసా ఇచ్చిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధిక వర్షాలతో దెబ్బతిన్న మరియు కూలిపోయిన ఇండ్ల వివరాలను త్వరగా అందించాలని, గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి గ్రామంలోని ఇండ్లలో మరియు పరిసర ప్రాంతాల్లో నిలిచిన నీటిని జెసిబి ద్వారా కాలువ తీసి నాలాలోకి మళ్లించాలని, గ్రామంలో ఉన్న పిచ్చి మొక్కలను, ముళ్లపోదలను తొలగించి శుభ్రంగా చేయాలనీ, వ్యాధులు ప్రబలకుండా సానిటేషన్ పగడ్బందీగా నిర్వహించి ఫాగింగ్, నిలువ నీళ్లలో ఆయిల్ బాల్స్ వేయాలని, నాలాలపై అక్రమ నిర్మాణాలు గుర్తించి నివేదిక ఇవ్వాలని, పంచాయతీరాజ్ ఇంజనీర్లతో గ్రామంచేయడంలోతుర్షాలతో చెడిపోయిన డ్రైనేజీ ని పరిశీలించి దానిని వెడల్పు చేయడం, లోతు చేయడం మరియు పూడికను తొలగించేందుకు ప్రతిపాదనలు పంపాలని తాసిల్దార్ సురేఖ, ఎంపీడిఓ శోభ లను ఆదేశించారు. వీధి కుక్కలను పట్టించి సిద్దిపేటలో ఉన్న ఎనిమల్స్ బర్త్ కంట్రోల్ సెంటర్లో ఆపరేషన్ చేయించి వదిలి పెట్టాలని గ్రామపంచాయతీ అధికారులను ఆదేశించారు.
బదుగుల చెరువు నుండి తీగలకుంటపల్లి చెరువు వరకు నాలాను పూర్తిగా నిర్మించుటకు, ఇప్పటికీ ఉన్న వాల్ కు రిటైనింగ్ వాల్ ఎత్తు పెంచడం మరియు లోతు పెంచి నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ అనురాధ, హుస్నాబాద్ ఆర్డిఓ రామ్మూర్తి, ఏసీపి సతీష్ తదితరులు పాల్గొన్నారు.