తెలంగాణ TGPSC గ్రూప్-2 పరీక్ష డిసెంబర్ కు వాయిదా
సిద్దిపేట టైమ్స్ డెస్క్:
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో TGPSC గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా, డిసెంబర్ కు వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కొత్త తేదీలను త్వరలోనే TGPSC ప్రకటించనుంది. డీఎస్సీ నేపథ్యంలో గ్రూప్-2 వాయిదా వేయాలని నిరుద్యోగులు కోరడంతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
గ్రూప్ – 2లో 783 పోస్టులకు 5.51 లక్షల అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నిన్న అభ్యర్థులతో చర్చలు జరిపిన ప్రభుత్వం, పోస్టులు పెంచి ఎగ్జామ్ వాయిదా వేయాలని డిమాండ్ చేసిన అభ్యర్థులు, పోస్టులు పెంచుతారా లేదా అనే దానిపై అనుమానం..?!