సిద్దిపేట టైమ్స్ డెస్క్:
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూన్లో నిర్వహించిన గ్రూప్ – 1 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను ఈ రోజు విడుదల చేసింది. ఫలితాలు మరియు మెయిన్స్ కు ఎంపికైన అభ్యర్థుల వివరాలను టీజీపీఎస్సీ తన అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ లాగిన్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. తుది కీతో పాటు రిజల్ట్స్ను టీజీపీఎస్సీ ఒకేసారి విడుదల చేసింది. గ్రూప్-1 మెయిన్స్కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు.