ప్రైవేట్ స్కూల్ల దోపిడిని అరికట్టండి

ప్రైవేట్ స్కూల్ల దోపిడిని అరికట్టండి

హుస్నాబాద్ లో ప్రైవేట్ స్కూల్ల దోపిడిని అరికట్టండి 

అధిక ఫీజులు వసూలు చేస్తూ టీచర్లకు తూతూ మంత్రంగా జీతాలు

ప్లే గ్రౌండ్, ఫైర్ సేఫ్టీ లేని స్కూళ్లు

ఎంఈఓ తనిఖీలు చేసి స్కూళ్లకు పర్మిషన్ ఇవ్వాలి

బీఎస్పీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్ 

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

బిఎస్పి హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ పార్టీ ఆఫీసులో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ప్రైవేటు ఉన్నత పాఠశాలలు మరియు ప్రాథమిక ఉన్నత పాఠశాలలు నిబంధనలు గాలికి వదిలేసి తమ ఇష్టం అన్నట్టు స్కూలు నడుపుతున్నాయని అన్నారు. ప్రతి స్కూల్లో  టెట్ క్వాలిఫై అయిన  టిటిసి, బీఈడీ చేసిన వారే విద్యార్థులకు విద్యను బోధించాలి. కానీ స్కూల్ పర్మిషన్ తీసుకున్నప్పుడు వివిధ సబ్జెక్టులకు సంబంధించి టిటిసి, బీఈడీ పూర్తి చేసిన వారి సర్టిఫికెట్లతో స్కూలు యజమాన్యం పర్మిషన్లలో చూపిస్తుంది. కానీ విద్యా బోధన చేసేవారు చాలా మటుకు వేరుగా ఉంటున్నారని, వివిధ స్కూల్లు ఇచ్చే టీచర్ల వివరాలు వేరుగా ఉంటున్నాయని, చాలావరకు అర్హత లేని వారే  విద్యార్థులకు బోధిస్తున్నారని అన్నారు.

అదేవిధంగా స్కూల్లో పనిచేసే స్వీపర్లకు, అటెండర్లకు కార్మిక చట్టాల ప్రకారం జీతాలు ఇవ్వట్లేదు. స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేస్తూ ప్రైవేట్ టీచర్లకు తూతూ మంత్రంగా 15 నుండి 20,000 ఇస్తున్నారు. స్కూల్ లకు సంబంధించి ఒకటి నుండి పది వరకు బోధించే పాఠశాలలో విధిగా 20 గుంటల భూమి ప్లేగ్రౌండ్ చూపించాలి. (700 మీటర్లు). ఫైర్ సర్టిఫికేట్, ఫైర్ సేఫ్టీ   సిబ్బంది ప్రత్యేకంగా విధిగా స్కూల్లో ఉండాలి. ఒక పి ఈ టి టీచర్ ఉండాలి. బస్సుల నుండి కిటికీల ద్వారా పిల్లలు చేతులు బయటపెట్టే అవకాశాలుంటాయి కాబట్టి విధిగా ఇనుప జాలి బిగించాలి. అనుభవం కలిగిన డ్రైవర్ని, క్లీనర్లను  నియమించాలి. నెలవారీగా విద్యార్థుల ఫీజుల వివరాలు M E O కి అందించాలి. స్కూలు ప్రారంభానికి ముందే ఎంఈఓ తనిఖీలు చేసిన తర్వాతనే ప్రైవేటు స్కూళ్లకు పర్మిషన్ ఇవ్వవలసి ఉంటుంది. వెంటనే ఇట్టి విషయంలో ఎంఈఓ ప్రైవేటు టీచర్ల అర్హత విషయం మరియు వివిధ వసతులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బిఎస్పీ పార్టీ పక్షాన, బీసీ సంక్షేమ సంఘం పక్షాన కోరడం జరుగుతుంది. లేకపోతే ఎంఈఓ ఆఫీసును  ముట్టడించడం జరుగుతుంది అని హెచ్చరించారు.

ఈ సమావేశంలో నియోజకవర్గ కన్వీనర్  వేల్పుల రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలగందుల శంకర్, నాయకులు శరత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *