పేదవాడి కడుపు నింపడమే ప్రభుత్వ ద్యేయం.. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా. దామోదర రాజనర్సింహ

పేదవాడి కడుపు నింపడమే ప్రభుత్వ ద్యేయం.. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా. దామోదర రాజనర్సింహ

పేదవాడి కడుపు నింపడమే ప్రభుత్వ ద్యేయం..

అర్హులైన లబ్ధిదారులకు సన్న బియ్యం అందించాలి..
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం..
పెదంటి ఆడపిల్లల పాలిటవరం..
రాష్ట్రం లో 7,500  ట్రామా కేంద్రాల ఏర్పాటు..
రాష్ట్ర  వైద్య ఆరోగ్యం లో నూతన పాలసీని తీసుకొస్తున్నము ..

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా. దామోదర రాజనర్సింహ

సిద్దిపేట్ టైమ్స్, మెదక్ జిల్లా ప్రతినిధి;

పేదవాడి కడుపు నింపడమే ప్రభుత్వ ద్యేయమని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డా. దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం నర్సాపూర్ నియోజక వర్గ కేంద్రం లోని సాయికృష్ణ ఫంక్షన్ హాల్ లో జరిగిన కళ్యాణలక్మి, షాదిముబారాక్,
సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డా. దామోదర రాజనర్సింహ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా మంత్రి ముందుగా రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ  దారిద్య రేఖకు దిగునున్న రేషన్ కార్డు కలిగిన పేదవారికి సన్న బియ్యం పంపిణీ చేసి వారి కడుపు  నింపడమే ధ్యేయంగా
ముందుకు పోతున్నామన్నారు. మెదక్ జిల్లాలో 520 రేషన్ షాపుల ద్వారా 2,13,828 రేషన్ కార్డ్ దారులకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్న బియ్యం 4430.496 మెట్రిక్ టన్నులు పంపిణీ చేయడం జరుగుతుందని దీని ద్వారా 6 లక్షల 96 వేల 043 మంది సభ్యులకు సన్న బియ్యం పంపిణీ ద్వారా లబ్ధి చేకూరనుందని తెలిపారు.
నర్సాపూర్ నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షిస్తూ  రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
రహదారులపై ప్రతి 35-40 కిలో మీటర్ల దూరం లోపు ట్రామ కేంద్రాన్ని నెలకొల్పబోతున్నామని చెప్పారు. రాష్ట్రం లో 7,500  ట్రామా కేంద్రాల ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో అంబులెన్స్ కూడా ఏర్పాటు చేస్తాం అని చెప్పారు.రాజకీయాల్లో గెలుపు ఓటముల తో పాటు క్యారక్టర్ ముఖ్యంగా అభివర్ణించారు. రాబోయే కాలం లో ప్రతి వ్యక్తి విద్య వంతుడు, సంస్కార వంతుడు కావాలన్నదే ద్యేయంగా పేర్కొన్నారు. బాలికలు నైపుణ్య అభివృద్ధి చెంది, మహిళా సాధికారత సాధించాలన్నారు. ప్రమాదాలకు కారణం యువత చెడు వ్యసనాలు  సమాజాన్ని ,పిల్లల్ని వ్యసనాల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉన్నదన్నారు. నర్సాపూర్ కు, ట్రామా  సీ  టి,స్కాన్ సెంటర్, ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను త్వరలో ప్రారంభం చేసుకుందాం అని చెప్పారు. పార్టీలకు అతీతంగా సేవ చేసినప్పుడే ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుంది అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది మార్పును కోరుకుంటూ తెలంగాణ సమాజానికి జవాబుదారీతనంతో సంక్షేమ పథకాల అందించడం లక్ష్యంగా ముందుకు పోవాలని పేర్కొన్నారు. మహిళా సాధికారతే ధ్యేయంగా
బాలిక విద్యను ప్రోత్సహిస్తూ తెలంగాణలో ప్రతి ఆడబిడ్డ ఉన్నత చదువులు చదువుకుని స్వతహాగా బ్రతికే విధంగా తీర్చిదిద్దాలన్నారు.
రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు సహజమని మన క్యారెక్టర్ చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. గెలుపు ఓటములు సహజం మన ప్రాంతం మన గ్రామం అభివృద్ధి పదంలో నడవాలంటే అందరి సమన్వయంతో సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడం చాలా అవసరంగా చెప్పారు. యువత కుటుంబాలకు బాధ్యతగా బాసటగా నిలవాలని, పేద విద్యార్థులందరూ డాక్టర్లు కావాలని ఆకాంక్షించారు.
నైపుణ్య శిక్షణ నాణ్యమైన విద్య తెలంగాణ సమాజానికి మూల స్తంభాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా నర్సాపూర్ శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందు వరుసలో ఉంచేందుకు మంత్రివర్యులు సహకారం చాలా అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయాలలో అపార అనుభవిజ్ఞులైన వ్యక్తి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అని అన్నారు. జక్కపల్లిలో 25 ఎకరాల స్థలంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. చిల్పిచేడు మాసాయిపేట నూతన మండలాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదాల నివారించేందుకు  రహదారి నిబంధనలు,ట్రాఫిక్ సమస్యలపై  మంత్రివర్యులు దృష్టికి తీసుకువచ్చారు. కొండ్యాల – చౌటపల్లి రోడ్డుకు సంబంధించి  శాసనసభ్యులు మాట్లాడారు. నర్సాపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచడం మౌలిక వసతులు కల్పించడంలో సహాయ సహకారాలు అందించాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూరేషన్ కార్డు కలిగిన ప్రతి లబ్ధిదారుడికి సన్న బియ్యాన్ని అందించాలన్న చారిత్రాత్మక పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. సన్న బియ్యంతో పాటు ప్రభుత్వం అందిస్తోన్న అన్ని సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని, అభివృద్ధి సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, నర్సాపూర్ ఆర్డిఓ మహిపాల్ రెడ్డి, మెదక్ గ్రంథాలయ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి, తాసిల్దార్ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ లు నర్సాపూర్ నియోజకవర్గ తాసిల్దారులు, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *